పాపం లోకేష్ బాబు.. అంత అనుకున్నది అనుకున్నట్టు జరిగింటే.. ముఖ్యమంత్రి అయ్యేవాడు.. కానీ అది జరగలేదు.. అందుకే లోకేష్ కాస్త సీఎం బదులు ట్విట్ స్టార్ అయ్యాడు. ఎప్పుడు ట్విట్టర్ లో ట్విట్లు పెడుతూ అనవసరంగా నెటిజన్లతో తిట్లు తింటుంటాడు నారా లోకేష్.. ఇక అప్పడప్పుడు అధికార పార్టీ నేతలు కూడా నారా లోకేష్ చేసే పప్పు పనులపై విమర్శలు చేస్తుంటారు.  

 

అలాంటి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నారాలోకేష్ పై అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చుసిన నెటిజన్లు అంత బాబోయ్ అని అంటున్నారు.. ఇవి అన్ని తెలుసు కాబట్టే నారాలోకేష్ ఓడిపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''అచ్చన్న దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడు. పార్టీ అండగా నిలవక పోతే డైరీలన్నీ బయటకు తీస్తానని బెదిరిస్తున్నాడట. లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే కుంభకోణం జరిగింది. అందుకే అచ్చన్న ధీమాగా ఉన్నాడు.'' అంటూ సెటైర్లు వేశారు విజయసాయి రెడ్డి. 

 

కేవలం ఈ ట్వీట్లే కాదు.. ఉదయం నుండి చంద్రబాబు.. నారా లోకేష్ పై ఒకటే ట్విట్లు..  ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం అంటూ సెటైరికల్ ట్విట్ వేసి నెటిజన్లను కడుపుబ్బా నవ్వించేశాడు.. ఇలా ఈ ఆదివారాన్ని పొలిటికల్ సెటైరికల్ ట్వీట్లతో ట్రెండ్ అయ్యాడు విజయసాయి రెడ్డి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: