ఈ మధ్య కాలంలో స్పా పేరులతో వివిధ రకాల మాసాజ్ సెంటర్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే.. అయితే పేరుకు మాత్రమే అవి మసాజ్ సెంటర్లు కానీ అక్కడ భారీ ఎత్తున జరిగేది మాత్రం వ్యభిచారం..బడానాయుకుల అండలో ఉన్న కొన్నీ స్పా సెంటర్లలో భారీ ఎత్తున వ్యభిచారం పడగలు విప్పుతుంది. ముఖ్యంగా మెట్రో సిటీలు అయినా హైదరాబాద్, బెంగుళూరులో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 

 

 


వివరాలోకి వెళితే.. కర్ణాటక బెంగుళూరులో నగరంలో విలాసవంతంగా కనిపించే ఓ స్పా మాటున వ్యభిచారం జరుగుతోంది. గుట్టుగా జరుగుతున్న ఈ దందాను బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలోని మహదేవపుర ప్రాంతంలోని హూడీ ప్రాంతంలో నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌లో రహస్యంగా ఆరుగురు మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది.

 

 


సామాచారం అందుకున్న సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి వ్యభిచారం రొంపి నుంచి ఆరుగురు మహిళలను కాపాడారు. పక్కా ప్రణాళికతో స్పా మాటున సాగుతున్న ఈ వ్యభిచారం రాకెట్ గుట్టును రట్టు చేశారు. స్పా నిర్వహకులైన ముగ్గురు కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పా బాగోతంపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

 

 


ఈ సిటీలో మాసాజ్ పేరుతో వ్యభిచారం చేస్తూ ఓ ముఠాను గుట్టు రట్టు చేసింది. గతంలోనూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోరమంగ్ల తదితర ప్రాంతాల్లో జరిపిన ఆకస్మిక దాడుల్లో పలు స్పా సెంటర్లలో గుట్టుగా వ్యభిచార దందా సాగుతున్నట్లు బయటపడింది. జాక్ అండ్ స్పా పేరుతో చలామణీ అవుతున్న అనే సంస్థ యజమాని, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.విచారణలో భాగంగా వారిని విచారణ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: