రోడ్డు ప్రమాదంలో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అంతసేపు సంతోషంగా గడిపిన వారు మారుక్షణంలో రోడ్డు ప్రమాదంలో కనుమరుగైపోతున్నారు. నియమిత వేగం కంటే ఎక్కువ స్పీడ్ తో ప్రయాణం చేస్తూ వారి ప్రాణాలను కోల్పోతున్నారు. స్పీడ్ లో వెళ్తున్న బైక్ కి చిన్న రాయి తగిలిన పెను ప్రమాదానికి దారి తీస్తుంది. రోడ్డు ప్రమాదంలో రోజుకు చాలా మంది గురై వారి ప్రాణాలనో, అవయవాలనో కోల్పోతున్నారు. మరోమారు నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

 

కేటీఎం బైక్‌పై ఓ యువకుడు వెళ్తుండగా కుక్కు అడ్డుగా వచ్చింది. మృతుడి వేగంగా వెళ్తూ కుక్కను ఢీకొట్టడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. వాహనంపై యువకుడు డివైడర్‌పై పడిపోవడంతో అతడి తలకు తీవ్రగాయమైంది. యువకుడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో కుక్కు కూడా మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

 

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అంటున్నారు. యువకుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడేవాడు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఆ వెనుకే వస్తున్న మరో వ్యక్తి అతడి వాహనాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి.

 

మరోవైపు, నగరంలో తరుచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకటి మరచిపోక ముందే మరొకటి చోటుచేసుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సి వస్తోంది. ఆదివారం నాడు నగరంలో జరిగిన ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. హయత్‌నగర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. భారీగా జరిమానాలు విధిస్తున్నా, కేసులు పెడుతున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: