నిత్యానంద ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేపుతూ వార్తల్లో ఉండే నిత్యానంద స్వయం ప్రకటిత దైవ స్వరూపుడు అని ప్రకటించుకున్న విషయం తెలిసిందే.   స్వామి నిత్యానంద కొన్ని రోజుల క్రితం  ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిలో కైలాసం పేరిట స్వతంత్ర దేశాన్ని నిర్మిస్తున్నానని తెలిపి సంచలనం రేపిన విషయం తెలిసిందే.  బాలికల అపహరణ, వేధింపులపై తనపై కొందరు కేసులు పెట్టడంతో భయపడిపోయిన నిత్యానంద విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నాడు. అతడి ఆచూకీ కోసం ఇప్పటికే ఇంటర్‌పోల్‌  నోటీసులు జారీ చేసింది. .బెంగళూరుకు చెందిన జనార్దన్‌ శర్మ...  తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్‌ చేసి అహ్మదాబాద్‌ ఆశ్రమంలో నిర్బంధించారంటూ గుజరాత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దాంతో నిత్యానంద  పై పోలీసులు కిడ్నప్ కేసును నమోదు చేసారు. 

 

ఇవే కాక ఆయనపై ఇంకా ఎన్నో కేసులు నమోదు అయ్యాయి.   నిత్యానందను పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సహాయం కోరారు గుజరాత్ పోలీసులు.అయినా నిత్యానంద ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉంటే ఆయన ఒక కొత్త దేశాన్ని నిర్మిస్తున్నానని ఒక దీవిలో నిర్మిస్తున్న ఈ దేశానికి కైలాసం అనే పేరు పెడుతున్నానని నిత్యానంద ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ  కైలాస నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు. ఇకపై తాను తమిళనాడుకు రానని చెప్పేశాడు. తాను మృతి చెందితే తన భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని చెప్పాడు.

 

అదే తన చివరి కోరిక అని అన్నాడు.  తన గురించి సీక్రెట్ గా వీడియోలు రిలీజ్ చేస్తూ పోలీసుల కంట పడకుండా తప్పించుకుంటున్నారు.  ఇప్పటికే నిత్యానంద వల్ల బాధింపబడిన భక్తులు ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది ఆయన నిజంగానే దైవ స్వరూపులు అంటున్న మూఢ భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.  ఏది ఏమైనా నిత్యానంద విషయంలో పోలీసులు చాలా సీరయస్ గానే వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఆయన ఆచూకీ లభిస్తే వెంటనే అరెస్టుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: