మన సంప్రదాయంలో పెళ్లికి చాలా విలువ ఉంది. గతంలో ఒక్కసారి పెళ్లయితే ఆ దంపతులు కడదాక కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ పక్క సంస్కృతులకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా అక్ర‌మ సంబంధాల వ‌ల్ల  పచ్చని కాపురాలను కకావికలం చేస్తున్నాయి. వేరొకరితో పెట్టుకుంటున్న సంబంధాలు భార్యభర్తల్నీ, వారి పిల్లల జీవితాలను చిదిమేస్తున్నాయి. భర్త విదేశాల్లో ఉండటంతో సెక్స్ కోరికలు ఆపుకోలేకపోయిన భార్య డ్రైవర్‌తో కలిసి పరారైన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. ఇప్ప‌టికే  కన్నబిడ్డలను వదిలేసి ప్రియుడితో పరారుకాగా పోలీసులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టారు. అయితే మ‌ళ్లీ నీచంగా అదే ప‌ని చేయ‌డంతో క‌ల‌క‌లం రేపింది.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కన్యాకుమరి జిల్లా తిరుపట్టార్ ప్రాంతానికి చెందిన శరవణ, సంగీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఉద్యోగం నిమిత్తం శరవణ కొన్నాళ్లుగా విదేశాల్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు సెలవు మీద స్వస్థలానికి వచ్చి వెళ్లేవారు. ఇక క్లాసికల్ డ్యాన్సర్ అయిన సంగీత తిరుపట్టార్ ప్రాంతంలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే భర్త విదేశాల్లో ఉండటంతో సంగీత కోరికలు తీర్చుకునేందుకు స్కూల్‌లో డ్రైవర్‌గా పనిచేసే అరుణ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. మ‌రోవైపు అరుణ్‌కి కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. కానీ, వీళ్ల‌కు అవేమి ప‌ట్ట‌కుండా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. 

 

ఇక‌ ఒకే స్కూల్‌లో పనిచేస్తుండటంతో వారిద్దరూ తరుచూ ఏకాంతంగా గడిపేవారు. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది జులై నెలలో అరుణ్‌తో క‌లిసి సంగీత వెళ్లిపోయింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ జంటను పట్టుకుని తీసుకొచ్చారు. అలాగే వారిద్ద‌రికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే ప్రియుడిని విడిచి ఉండలేని సంగీత అతడితో మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించింది. ఇక తాజాగా అరుణ్‌తో పిల్ల‌ల‌ను వ‌దిలేసి నీచంగా మరోసారి పరారు కావడంతో కుటుంబసభ్యులు విస్మ‌యానికి గుర‌య్యారు. దీంతో పోలీసుల‌కు మ‌రోసారి పిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: