తల్లి దండ్రుల తో కూడా చెప్పు కోలేని కొన్ని స్నేహితుల తో చెప్పుకుంటామని చాలా మంది అంటుంటారు. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. చిన్న విషయాలకు స్నేహితుల మధ్య గొడవలు అనేవి సహజం కానీ కొద్దీ రోజులకు మళ్ళీ అంత మామూలే కలిసిపోతుంటారు. అందుకే కవులు కూడా సముద్రం లో నీరు కన్నా స్నేహం గొప్పది అని కవితలు రాస్తూ  స్నేహం గొప్ప తనాన్ని మరింత పెంచుతారు. 

 


అయితే చిన్న విషయాని కి గొడవ పడితే మర్చిపోతాము.. కానీ ఎటువంటి కారణాలు లేకుండా చిన్న గొడవకు అది కూడా బజ్జీల కోసం గొడవపడి తన ప్రాణ స్నేహితుడి ని కత్తి తో అతి దారుణంగా పొడిచి చంపినా ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడ్ని 14 ఏళ్ల మరో బాలుడు కత్తితో పొడిచాడు. 

 


ఈ ఘటనలో కత్తిపోట్లతో బాలుడి కి తీవ్ర గాయాలు కావడం తో స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి చేర్చారు. ఓ మిర్చి బండి వద్ద ఇద్దరు మిర్చీలు తింటుండగా వివాదం తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.దీంతో వారు గొడవ పడి, అది కొట్టుకొనే వరకూ వెళ్లిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే 14 ఏళ్ల బాలుడు కత్తితో పొడిచినట్లు తెలిపారు.

 

 

పొట్టలో తీవ్ర గాయాలపాలైన బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కత్తి తో పొడిచిన 14 ఏళ్ల బాలుడు పారిపోతుండ గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఘటన పై బాలుడ్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. నిందితుడ్ని అతని తల్లి దండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: