రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతోంది... లోకం తీరు కొత్త పుంతలు తొక్కుతోంది... ఇప్పుడిప్పుడే ఆనాటి కాలం మూఢ నమ్మకాలను మరుస్తున్నారు ప్రజలు.కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా కుల వివక్ష మాత్రం పోవడం లేదు. కులం పేరుతో మరణాలు జరుగుతున్నాయి. కులం పేరుతో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు ఎన్ని సంస్కరణలు ఎంత అవగాహన చేపట్టిన ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు. సాటి మనుషులపై మానవత్వం ఉండడం లేదు. దేశంలో అక్కడక్కడ కుల వివక్ష ఇంకా కనబడుతూనే ఉంది. అయితే దేశంలో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. దళిత కులానికి చెందిన యువకుడు అగ్రకులాలకు చెందిన యువతితో  మాట్లాడటాన్ని  జీర్ణించుకోలేని కుల పెద్దలు... గ్రామస్తులు అందరి సమక్షంలో ఆ యువకునికి శిక్ష విధించారు.

 

 

 అందరి సమక్షం లోనే గుండు కొట్టించి అవమానించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ లోని జ్యోతి పూర్ లో మెకానిక్ షాప్ లో పనిచేసే రాహుల్ మెగావాల్  అనే యువకుడు ఈనెల 18వ తేదీన అతడికి తెలిసిన అగ్రకులానికి చెందిన యువతి తో మాట్లాడాడు. అయితే వీరిద్దరూ ఓ కాఫీ హోటల్ లో కలుసుకుని మాట్లాడుతున్న సమయంలో... గమనించిన అమ్మాయి కుటుంబ సభ్యులు కుల పెద్దలు ఆ యువకుడు ఇంటిపై దాడి చేశారు. అంతేకాకుండా ఆ యువకుని పిలిపించి గ్రామస్తులు అందరి సమక్షంలో గుండు గీయించి శిక్ష విధించారు.

 

 

 ఇక అతని కుటుంబ సభ్యులపై కూడా విచక్షణ మరచి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు... కుల పెద్దలు కుటుంబ సభ్యులు. ఇక ఈ ఘటన పోలీసుల వరకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: