అధికార పార్టీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో తనను హత్య చేసే ప్రయత్నం జరిగింది అంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం  ఆంధ్రా రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగింది అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ నందిగం  సురేష్. మహిళా జేఏసీ ముసుగులో టీడీపీ  మహిళా కార్యకర్తలు  తనపై దాడికి తెగబడ్డారు ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్లే తనపై దాడికి యత్నించారని ఆరోపించారు. 

 

 

 చంద్రబాబు ఆయన సామాజిక వర్గం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండాలని దుర్మార్గపు ఆలోచన తో చంద్రబాబు నాయుడు ఇలా వైసిపి నేతలపై దాడులు చేయిస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. అయితే తనపై దాడికి కారణమైన చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్. దళితులు రాజకీయాల్లో రాణించ కూడదని ఎప్పుడూ వెట్టిచాకిరీ చేయాలని భావనతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ నందిగామ సురేష్... సిట్  విచారణలో చంద్రబాబు అక్రమాలు అవినీతి మొత్తం బయట పడి పోతుంది అనే  భయంతోనే ఇదంతా చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 తనపై దాడి చేసే క్రమంలో గన్మెన్ల పై కారం చల్లి.. తన వద్ద పని చేసే వ్యక్తి పై చేయి చేసుకున్నారని ఆరోపించారు ఎంపీ సురేష్. దాడికి సంబంధించిన వీడియోలు తన వద్ద  ఉన్నాయని... చంద్రబాబు మానవత్వం లేని దుర్మార్గాలకు పాల్పడే వ్యక్తి అని.. నీచ సంస్కృతి చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పుతో కొట్టిన సిగ్గులేకుండా ఇలాంటి దాడులకు చంద్రబాబు ఉసిగొల్పుతోన్నాడు  అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్. అయితే వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ పై జరిగిన దాడి ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: