అసలు ఏడుకొండలపై కొలువైన ఆ స్వామివారి సన్నిదిలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్దితులు నెలకొంటున్నాయి.. ఆ కలియుగ వాసుని సన్నిధానంలో సేవచేసే వారు ఎంతో అదృష్టవంతులని అందరు నమ్ముతారు.. అంతటి భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకునే వారు కూడా ఉన్నారు.. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు కలవరాన్ని కలిగిస్తున్నాయి..

 

 

ఇకపోతే తాజాగా టీటీడీ అధికారి ఒకరు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. సూపరింటెండెంట్ స్థాయి అధికారిగా, రెండవ సత్రంలో పనిచేస్తున్న ఉమా శంకర్ రెడ్డి అనే వ్యక్తి అకస్మాత్తుగా ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన ఆయన, తిరుమలలోని ఓ ఉన్నతాధికారి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతను మరణించడానికి ముందు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ.. సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే తిరుమలలోని ఓ టీటీడీ ఉన్నతాధికారి.. సుపధం దర్శనం టికెట్ల మంజూరు విషయంలో శంకర్ రెడ్డి కి  అందరి ముందే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

 

 

అయితే ఆ సమయంలో ఉమాశంకర్ రెడ్డి.. అతనికి ఎదురు తిరిగి, నేను ఏ తప్పు చేయనప్పుడు  ఎందుకు మీకు భయపడాలి, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి.. అంటూ బహిరంగంగా ఉన్నతాధికారికి సమాధానం ఇచ్చిన నేపధ్యంలో, ఆ ఉన్నతాధికారి చైర్మన్ కార్యాలయం నుండి  బదిలీ వేటు వేశారని టీటీడీ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. ఇదే కాకుండా గతంలో పలుశాఖల్లో  విధులు నిర్వర్తించిన ఉమాశంకర్ రెడ్డి.. ఇలా  ఆత్మహత్యకు పాల్పడడం టీటీడీ ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

 

 

ఇతను ఒక్కడే కాదు తిరుమల ఉన్నతాధికారి కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న సురేష్.. అనే ఉద్యోగి కూడా గతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇతను.. ఇలా ఇంకెంతమంది పవిత్రమైన ఉద్యోగాన్ని నిర్వహిస్తూ, వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకోవాలని మిగతా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారట.. అంతే కాకుండా వీరిద్దరి ఆత్మహత్యకు కారణమైన వారు.. ఏ స్థాయిలో ఉన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: