మహిళలను కాపాడిల్సిన పోలీసు పదవిలో ఉన్న ఓ ఎస్సై  ఒళ్ళు  మరచి  మరి ప్రవర్తించాడని భార్య పిర్యాదు చేసింది. భాద్యత గల వృత్తిలో ఉన్న ఆ వ్యక్తి  ఇలా చేయడం పై పలువురు మహిళా సంఘాలు  ఆందోళన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన గుంటూరు లో చోటుచేసుకుంది. ప్రియురాళ్లతో ఉన్న భర్తకు బుద్ది చెప్పాలంటూ సొంత భార్య ఎస్పీని ఆశ్రయించింది. 

 


వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపుల ఆరోపణల తో గుంటూరు జిల్లా లో ఇప్పటి కే ముగ్గురు పోలీసులు సస్పెన్షన్‌ కు గురయ్యారు. ప్రస్తుత ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకున్న ఈ ఘటన కల కలం. గుంటూరు జిల్లా లో ఎస్ఐ గా పని చేస్తున్న ఎస్ఐ‌ పై భార్య ఎస్పీ కి సోమవారం నాడు ఫిర్యాదు చేసింది. తన భర్త తన ని అసలు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

 

 


ఇద్దరు యువతులతో ఎస్ఐ సంబంధాలు పెట్టుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. అంతేకాకుండా తన ప్రవర్తన బాగోలేదని పొలిసు స్టేషన్ లో పిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తుంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కూడ ఈ కేసును తొక్కిపెట్టారని ఆమె ఆరోపిస్తోంది. తన భర్త కారణంగా తన కుటుంబానికి హని ఉందని ఆమె ఆరోపించారు..

 

 

అయితే  తన భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని  ఎస్ఐ చెబుతున్నారు.గుంటూరులో ఇలాంటి ఘటన చాలనే చేసుకున్నాయని పొలిసు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇద్దరు ప్రియురాళ్లతో తాను ఉంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా  పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నారు.. పలువురు మహిళలు ఈ విషయం పై ఆరోపణలు చేస్తూ మండి పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: