ఈ మధ్యకాలంలో రాత్రి అయ్యిందంటే ఆడవాళ్లు బయట తిరగడానికి భయపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పోకిరి ల  నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో పాటు అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాత్రి సమయంలో ఆడవాళ్ళు బయట తిరగాలి అంటే భయపడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని చోట్ల మాత్రం మగవాళ్ళు కూడా బయట తిరగాలి అంటే భయపడుతున్నారు. కొంత మంది మహిళలతో మగవాళ్ళకి కూడా రక్షణ కరువైంది అనే చెప్పాలి. ఇక్కడ ఓ యువకుడికి  ఇలాంటి సంఘటన ఎదురైంది. రాత్రి సమయంలో బస్సు ఎక్కేందుకు  ప్రయత్నిస్తుండగా టీనేజర్ ని ముగ్గురు మహిళలు అడ్డగించారు. సెక్స్ లో కంపెనీ ఇస్తాం  మాతో రమ్మంటూ ఆ టీనేజర్లకు తెలిపాడు. ఇక భయంతో ఊగిపోయిన ఆ యువకుడు  ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో  ముగ్గురు మహిళలు అతనికి ఓ ట్విస్ట్ ఇచ్చారు . 

 

 

 ఇంతకీ ఏం జరిగింది తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల ప్రజ్వల్... కేఎస్  బస్సు దిగి లోకల్ బస్సు ఎక్కేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడికి ముగ్గురు మహిళలు అడ్డగించారు . సెక్స్ చేయడానికి రాత్రి ముగ్గురం కంపెనీ ఇస్తాం అంటూ ఆ యువకునికి ఆఫర్ ఇచ్చారు. మహిళల ప్రవర్తనతో భయపడిపోయిన టీనేజర్  అందుకు ఒప్పుకోలేదు.నువ్వు  ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డబ్బులు మాత్రం ఇవ్వాలి అంటూ వాళ్ళు బెదిరించారు. లేకపోతే నువ్వు మా పై అత్యాచారయత్నం చేశావు  అంటూ కేకలు వేస్తామంటూ  బ్లాక్ మెయిల్ చేసారు. ఆ ముగ్గురు మహిళల బెదిరింపులతో భయపడిపోయిన ఆ యువకుడు ఏకంగా  ఆ ముగ్గురు మహిళలకు 4000 సమర్పించుకుని వెళ్ళిపోయాడు.

 

 

 ఇక ఆ మరునాడు ఇదే విషయమై ప్రజ్వల్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మహిళలు  బెదిరించిన తీరును తెలిపాడు పోలీసులకు. తనకు  సెక్స్ లో  కంపెనీ ఇస్తామంటూ ముగ్గురు మహిళలు తాను బస్సు ఎక్కుతున్న సమయంలో అడ్డగించారని ... ఆ తర్వాత బెదిరించారని... నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ లాక్కున్నారని  ... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్రమంగా డబ్బులు వసూలు చేసిన.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళల కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: