తమిళ రాజకీయాలను శాసించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత 72వ పుట్టినరోజు సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి జయ కుమార్ తమిళనాడులో బంగారు ఉంగరాలు పిల్లలకు పంచారు. అయితే ఇక్కడ అందరికీ కాదనుకోండి ఆ రోజు పుట్టిన పిల్లలకు మాత్రమే పంచడం జరిగింది. దీంతో ఈ వార్త తమిళ మీడియా వర్గాల్లో రాజకీయాల్లో వైరల్ అయింది. అది కూడా రోయపురం ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో జయలలిత పుట్టినరోజు నాడు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చారట. ఇదే క్రమంలో అన్నా డి.ఎమ్.కె. పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జయలలిత పుట్టిన రోజు వేడుకలను చాలా ఘనంగా జరిపారు.

 

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ పుట్టిన రోజు వేడుకలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఏ ప్రాంతానికి చెందిన ఆ ప్రాంత అన్నా డి.ఎమ్.కె రాజకీయ నాయకులు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ మరియు కొన్ని చోట్ల పేదలకు భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో అయితే రక్తదానం కూడా చేశారు. దాదాపు రెండు సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా జయలలిత గెలవడంతో పాటు తమిళ ప్రజల మనసులను గెలుచుకోవడం తో తాజాగా జరిగిన పుట్టినరోజు వేడుకలు తమిళనాడులో చాలా సంచలనంగా మారాయి.

 

చాలా మంది మంత్రులు మరియు కార్యకర్తలు ఎన్నికల ముందు వచ్చిన జయలలిత పుట్టిన రోజు వేడుకలను పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం బాగానే కష్టపడ్డారు. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం రాష్ట్ర సచివాలయం వద్ద మొక్కలు నాటి ఘనంగా నివాళులు అర్పించారు. ఇదే సందర్భంలో సినిమా రంగంలో జయలలిత పేరిట తెరకెక్కుతున్న బయోపిక్ ‘తలైవి’ లో జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ కొత్త లుక్‌ను విడుదల చేశారు‘తలైవి’ సినిమా యూనిట్. దీంతో కంగనారనౌత్ కొత్త లుక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: