ప్రపంచం అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవడమే కానీ, ఇంకా అక్కడక్కడ కులం, మతం పేరుతో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు అన్ని రంగాల్లో ఆడ, మగా అనే తేడా లేకుండా సమాన స్దాయిలో ముందుకు దూసుకెళ్లుతున్న తరుణంలో కూడా కొన్ని చోట్ల జరిగే ఆరాచకాలకు అంతే లేకుండా పోతుంది..

 

 

నాటికాలంలో అంటే బ్రిటీష్ వారు పాలించే కాలంలో, పటేల్ వ్యవస్ద ఉన్న సమయంలో ఆడవారికి అసలు విలువే లేదు.. అందునా అగ్రకులాల వారి అహంకారానికి అంతే లేదు.. దళితులంటే అంటరాని వారిగా చూసేవారు.. కాని రోజులు మారాయి.. అందరు కలిసిపోయారు.. కులాలకు అతీతంగా పెళ్లి పేరుతో ఒక్కటవుతున్నారు.. ఇలాంటి సమయంలో కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని ఇంకా మెదడుల నుంచి తొలిగించకుండా బతికేస్తున్నారు కొందరు. ఇదిగో తాజాగా రాజస్థాన్‌లోని జోథ్ పూర్‌లో జరిగిన ఘటన అసలు మానవత్వం అనేది బతికే ఉందా అని అనుమానం వచ్చేలా చేస్తుంది. ఆ వివరాలు తెలుసుకుంటే...

 

 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో, రాహుల్ మేఘ్వాల్‌ అనే 20ఏళ్ల దళిత వ్యక్తిని ఒకఅగ్ర కులానికి చెందిన వారు కొందరు కొట్టారు. కొట్టడమే కాదు అర గుండు కూడా కొట్టారు. ఎందుకంటే ఒక అగ్ర కులానికి చెందిన  అమ్మాయిని కలిశాడనే కారణంతో రాహుల్‌ని దారుణంగా కొట్టి అరగుండు కూడా చేయించారట. ఏదో చిన్న మెకానిక్‌గా బ్రతుకుతున్న రాహుల్ కు, అగ్ర కులానికి చెందిన ఒక అమ్మాయితో గత కొంతకాలంగా పరిచయం ఉందట.. ఆ పరిచయంతో అనుకోని ఒక సందర్భంలో ఆ అమ్మాయి ఎదురుపడగా వారిద్దరు మాట్లాడుకున్నారట.

 

 

అయితే అమ్మాయి తరుపు కులం వారు.. వీరిద్దరిని అలా చూసే సరికి ఆవేశంగా రాహుల్‌ని కొట్టి అరగుండు గీసి విచక్షణ రహితంగా కొట్టారట... దీంతో గాయాలపాలైన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఇనుప కడ్డీలతో కొట్టడం, బలవంతంగా గుండు గీయడం, వంటివి చేసినందుకు సెక్షన్లు 323, 341 , 342 మరియు 143 సెక్షన్ల కింద ఎస్సీ/ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారట జోధ్ పూర్ పోలీసులు. ఇకపోతే ఈ దాడి చేసిన నిందితుల్లో ఏడుగురు మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: