చంద్రబాబుని ప్రతి రోజు విమర్శించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే.. అది విజయసాయి రెడ్డినే. పచ్చ పార్టీ నేతల నోర్లు మూయించాలి అంటే కేవలం ఒక్క విజయసాయి రెడ్డికి చేతనవుతుంది.. ఎందుకు అని మీకు సందేహం రావచ్చు... విజయసాయి రెడ్డి ఒక్క మాట మాట్లాడాడు అంటే కొన్ని గంటల సమయం తీసుకొని మాట్లాడుతారు ఆ నేతలు.. ఎందుకంటే విజయసాయి రెడ్డి అంతగట్టిగా కొడుతారు దెబ్బ..   

 

ఇకపోతే.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తే వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లోకి ఎక్కుతుంటాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కారం చాల్లే పెప్పర్ గ్యాంగ్ ను విధుల్లోకి వదిలారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి..  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నాడు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకున్నాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలాడు. వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే.'' అంటూ విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. జగన్ ని ఎదుర్కోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు... పాపం అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపలేడని..చంద్రబాబుకు తెలీదు..'' అంటూ కొందరు అంటే... మరికొందరు స్పందిస్తూ.. అయన ఇంకా ఊహ లోకంలో ఉన్నాడు లెండి.. వదిలెయ్యండి.. నిజం  తెలుసుకున్న రోజు పిచ్చోడు అవుతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: