కాకినాడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తిని గుడారిగుంటలో ఉన్న తన ఇంట్లో కత్తులతో నరికి చంపాడో దుండగుడు. ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన దుండగుడు.. బ్రహ్మానందం భార్య చూస్తుండగానే అతడ్ని నరికి చంపి పారిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. బ్రహ్మానందాన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? పాత క్షక్షలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
అయితే దర్యాప్తు షాకింగ్ విషయాలు బయటకు రావడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. లారీ డ్రైవర్గా పనిచేసే బ్రహ్మానందం అతని మరదలు మంగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరు గొడారిగుంట దుర్గానగర్లో అద్దింట్లో నివాసం ఉంటున్నారు. అలాగే భార్య మంగలక్ష్మి కాకినాడ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామం సావరంపేటకు చెందిన ఈతకోటసూర్యప్రకాష్ అనే సూర్య డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ అవుదామని కాకినాడలో ట్రైనింగ్కు వచ్చాడు. కానీ, శిక్షణ మధ్యలో మానేసి కార్పొరేషన్లో పారిశుద్ధ్య సూపర్వైజర్గా చేరాడు.
అయితే ఈ క్రమంలోనే సూర్యప్రకాష్, మంగలక్ష్మిల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో సూర్యప్రకాష్ మంగలక్ష్మి ఇంటి పక్కన అద్దెకు దిగాడు. ఇక మూడు నేలల కింత్ర భర్తకు తెలియకుండా మంగ సుర్యప్రకాష్తో తాళి కట్టించుకుంది. అయితే వీరి పరిచయానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి హతమార్చేందుకు వ్యూహం పన్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల కిందట సూర్యప్రకాష్ విధులకు సెలవు పెట్టి ఈ నెల 19న రాత్రి మంకీ క్యాప్, చేతులకు గ్లౌస్, స్వెట్టర్ ధరించి మోటారు సైకిల్తో పాటు ఆయుధం తీసుకుని వచ్చాడు.
అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బ్రహ్మానందం ఇంట్లోకి ప్రవేశించి.. భర్త హత్యకు భార్య సహకరించడంతో దారుణంగా నరికి చంపి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి వీరి గుట్టును బట్టబయలు చేశారు. ఇక నిందితుడు ఈతకోట సూర్యప్రకాష్తో పాటు హతుడి భార్య మంగలక్ష్మిని సోమవారం అరెస్టు చేశారు. కాగా, సూర్యప్రకాష్ ఉంటున్న గదిని పరిశీలించగా డైరీలో మంగ వెడ్స్ సూర్య అని.. మంగ బంగారం అని కాగితంపై రాసి ఉందన్నారు. వీటి ఆధారంగానే సులువుగా నిందితుడిని పట్టుకున్నామన్నారు.