ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లి పేరుతో మోసాలు నయ వంచనలు ఎక్కువైపోతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్గా చేసుకుంటూ... ప్రేమ పెళ్లి పేరు చెప్పి అవసరం కోసం వాడుకుని ఆ తర్వాత నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి.. మంచి వాళ్ళ ముసుగులో ప్రేమిస్తున్నానని  పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూన్న మోసగాళ్ల  బారిన పడి ఎంతో మంది మహిళలు మోసపోతూనే ఉన్నారు. ఇంకొంతమంది అవమానాన్ని తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. ప్రేమిస్తున్నానని చెప్పాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు తీరా మహిళతో సహజీవనం చేసి... గర్భం దాల్చిన తర్వాత నిజస్వరూపాన్ని బయటపెట్టి గర్భాన్ని తీయించుకోవాలంటూ హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రియుడి నిజ స్వరూపం బయట పడడంతో పోలీసులను ఆశ్రయించింది యువతి. 

 

 

 వివరాల్లోకి వెళితే.. భర్త వదిలేసిన తనకు తోడుగా ఉంటానని చెప్పి కొన్ని రోజుల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత ప్రియుడు మోసం చేసిన ఘటన కర్నూలు జిల్లాలోనీ నంద్యాల లో చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ సదరు యువతి రోడ్డెక్కింది. నంద్యాల పట్టణంలోని వైయస్సార్ నగర్ కు చెందిన యువతికి చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఇక కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా మనస్పర్థల కారణంగా ఆ  యువతిని తన భర్త వదిలేశాడు. ఈ క్రమంలోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్కె  ప్రాంతానికి చెందిన అన్సార్  అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త సహజీవనం వరకు వెళ్ళింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెతో  ఎన్నో రోజుల పాటు సజీవం చేసాడు.  దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న అన్సర్ గర్భాన్ని తీయించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇక ప్రియుడి  అసలు రూపం బయటపడడంతో మొండికేసింది. 

 

 

 ఈ నేపథ్యంలోనే నువ్వు ఎలా కంటావో నేను కూడా చూస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అన్సర్. ఇక ప్రియుడు హెచ్చరికలతో ఆందోళన చెందిన ఆమె... పోలీసులను ఆశ్రయించింది. ఇదే క్రమంలో తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ పోలీసులను ఆన్సర్ కూడా పిర్యాదు చేసాడు. ఇక తాను ఎంత చెప్పినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. తనను మోసం చేసిన అంతటితో పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేసింది. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు ఏం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది బాధితురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: