మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారం చేసిన వాళ్ళను ఎంత కఠినంగా శిక్షించినప్పటికీ... ఇప్పటికీ  ఎక్కడ భయం  మాత్రం కనిపించడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలు చేస్తున్నారు. మంచి వాళ్ళ ముసుగులో నిండు  జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. దీంతో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కామపు కోరల్లో చిక్కుకొక  తప్పడంలేదు. ప్రస్తుతం ప్రతి చోట మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దేవాలయం లాంటి పాఠశాల కళాశాల ల్లో.. దేవుడితో సమానం అని చెప్పే గురువులు కూడా కామంతో రగిలిపోయి... నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా గురువులు విద్యార్థుల పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. 

 

 

 తాజాగా ఇలాంటి ఘటన జరిగింది... పాఠాలు చెప్పి సద్బుద్ధిని నేర్పాల్సిన గురువు ఎవరికీ చెప్పుకోలేని వికృత చేష్టలకు పాల్పడి.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏకంగా తన మనవరాలి వయసున్న విద్యార్థులతో కూడా మసాజ్ చేయించుకోవడం.. వారికి అశ్లీల వీడియోలను చిత్రాలను చూపించడం... చేస్తూ నిరంతరం వేధించేవాడు.. ఇలా ఆ గురువుకి విద్యార్థులను లైంగికంగా వేధించడం రోజూ అలవాటుగా మారిపోయింది. ఇక రోజు రోజుకు ఆ ఉపాధ్యాయుడి వికృత చేష్టలు ఎక్కువ అవడంతో భరించలేకపోయిన విద్యార్ధినులు  తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో అసలు ఈ యవ్వారం  బయటపడింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా రాజుపాలెంట  మండలం గణపవరం జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఎలిమెంటరీ స్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వరరావు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. మాస్టారు తీరుతో విసిగి పోయిన విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో..  ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి హెడ్మాస్టర్ వెంకటేశ్వరరావు కు దేహశుద్ధి చేశారు. ఇక పోలీసులకు సమాచారం అందించి... గురువు  ముసుగులో కామంతో కళ్లు మూసుకుపోయిన కామపిశాచి వెంకటేశ్వరరావును పోలీసులకు అప్పగించారు. ఇక ఈ వ్యవహారంపై  డిఎంఓ స్పందిస్తూ వెంకటేశ్వరరావు ను  సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: