డబ్బు ఉంది కదా అని ఓ కామాందుడు రెచ్చిపోయాడు.. ఏం చేసిన కూడా  అనుకున్న ఓ కుర్రాడు చేతికి అందివచ్చిన ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నా పెద్దా అని సంబంధం లేకుండా మరీ ఆడవాళ్లను అతి దారుణంగా రేప్ చేస్తున్నాడు.  అయితే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా కూడా చట్టానికి దొరక్క మానరు అన్న విషయాన్నీ మరో సారి పోలీసులు నిరూపించారు. 

 

 


ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డే లేకుండా పోతోంది. తాజాగా మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ మహిళా లెక్చరర్‌పై కాలేజీ మేనేజర్ కొడుకు అత్యాచారానికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.మహారాజ్‌గంజ్ జిల్లాలోని నతన్వా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్రాంతానికి చెందిన యువతి ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. 

 

 


గురువారం ఇంటికి ఆలస్యంగా వచ్చిన యువతి భోజనం చేసిన తర్వాత విషం తాగేసింది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రతన్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాజాగా తుది శ్వాసను విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువతి కుటుంబసభ్యులను విచారించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యువతిపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ టీచర్‌తో కలిసి ఆమెపై గురువారం అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి పోలీసులకు చెప్పాడు.

 

 

నిందితుడి తండ్రి మెడికల్ కాలేజీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని, చాలా రోజులుగా తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు పేర్కొన్నాడు.అయితే కాలేజీ నుండి ఇంటికొస్తున్న టైం లో తన స్నేహితుడితో అడ్డుకొని ఆమెపై అత్యాచారం చేసాడని వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆమె అవమానభారంతో విషం తాగేసిందని పోలీసులకు తెలిపాడు.దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: