ఈ మధ్యకాలంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మనిషి పుట్టుకకు కారణమైన మహిళ ఇప్పటికీ ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో  మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిన ఎవరిలో  భయం మాత్రం కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మహిళలకు సొంత వారి నుంచి లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇంట్లో కూడా రక్షణ లేని ప్రశ్నార్ధక జీవితం అయిపోయింది మహిళలది. 

 

 

 ఇప్పటికే ఇలాంటి ఘోరమైన ఘటనలు ఎన్నో జరగ్గా  తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. భార్య చెల్లెలిపై  పై కన్నేసిన భావ మాయమాటలు చెప్పి దారుణానికి ఒడిగట్టాడు. తాను అత్యాచారం చేయడంతో పాటు తన స్నేహితుడితో కలిసి పైశాచికంగా ప్రవర్తించాడు. ఇద్దరు కలిసి మరదలిపై కామవాంఛ తీర్చుకున్నారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు.ఇక దారుణాన్ని  తెలుసుకున్న బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లుథియానాలో  ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. లూథియానాకు  చెందిన మైనర్ బాలికపై అక్క భర్త కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే అక్క కొడుక్కి బాలేదని చూసేందుకు రావాలి అంటే కోరడంతో బావ తో పాటు తన ఇంటికి వచ్చింది బాలిక.  ఇక ఆ తర్వాత మద్యం తాగి వచ్చి. పిల్లాడికి బాగానే ఉందని మీ ఇంటి దగ్గర దింపుతా అంటూ మళ్ళీ బైకెక్కించుకున్నాడు. ఇక ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లకుండా బసంత్ నగర్ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ బంగళా కి తీసుకెళ్ళాడు. అక్కడ స్నేహితుడితో కలిసి ఆ మైనర్ బాలికపై అతి దారుణంగా అత్యాచారానికి తెగబడ్డాడు. ఇద్దరు కలిసి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారం చేశారు.బయట ఈ విషయం చెబితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం ఏమీ జరగనట్టుగానే ఆ యువతి ఇంటి దగ్గర దింపారు... ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లికి తెలపడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు  తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: