సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితం ఎంతో బాగుంటుంది. ఈ బాగుండడం మాట వినిపించేది కేవలం అవకాశాలు వచ్చేంత వరకు మాత్రమే.. ఎప్పుడైతే హీరోయిన్ లు   అవకాశాలకూ  దూరమవుతూ వస్తారో.. మెల్లమెల్లగా హీరోయిన్ లు  అందరికీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వాళ్ళందరూ ఇప్పుడు తెరమీద కనిపించకుండా పోయిన వాళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు కళ్యాణి. అప్పట్లో ఈ  హీరోయిన్ పట్టుకున్నదల్లా  బంగారం అయింది అన్నట్లుగా... చేసిన ప్రతి సినిమా మంచి విజయం సాధించింది. ఎంతో మంది దర్శక నిర్మాతలని ఆకర్షించు ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

 

 

 ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా జగపతిబాబుతో ఎన్నో సినిమాల్లో నటించి ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ దగ్గరైపోయింది కళ్యాణి . ఈ క్రమంలోనే కళ్యాణి  ఎన్నో  అవకాశాలు వచ్చాయి. కానీ కళ్యాణి తీసుకున్న ఒక నిర్ణయం ఆమె కెరీర్ ని మొత్తం నాశనం చేసింది అనే చెప్పాలి. ఎప్పుడైతే డైరెక్టర్ సూర్యని  పెళ్లి చేసుకుందో అప్పుడే ఆమె కెరీర్కు పుల్ స్టాప్ పడిపోయింది. అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న కళ్యాణి వస్తున్న అవకాశాలను కాలదన్నుకొని  మరి డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. 

 

 

 సత్యం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సూర్య ని ప్రేమించి పెళ్లి చేసుకుని కళ్యాణి . ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట విడిపోయింది. పెళ్లయిన తర్వాత కొంతకాలానికి వీరు కోర్టుల చుట్టూ తిరిగారు. వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇక కళ్యాణి కోర్టుల చుట్టూ తిరగడంతో ఈ అమ్మడికి కాస్త నెగిటివ్ ఇమేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత దర్శకులు ఎవరూ పట్టించుకోలేదు కళ్యాణి ప్రాధేయపడినా ఎవరు అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. తర్వాత ఎక్కడా కనిపించకుండా కనుమరుగైపోయింది ఈ అమ్మడు. అయితే ఆ తర్వాత కేరళలోని ఓ ప్రాంతంలో కళ్యాణి నాటువైద్యం చేయించుకుంటూ కనిపించిందని... తినడానికి తిండి లేక ఎంతో దుర్భర పరిస్థితి అనుభవించింది అని చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: