ఈ మధ్యకాలంలో దొంగతనాలు హత్యలు భారీగా పెరిగిపోతున్నాయి. మనిషి ప్రాణాలకు కొంచమైనా విలువ ఇవ్వడం లేదు సాటి మనుషులు. పైసల కోసం ప్రాణాలను తీసేస్తున్నారు. ముఖ్యంగా జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారు. ఇలా జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన వారు హత్యలు చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇక తాజాగా ఇలా జల్సాలకు అలవాటుపడి వరుస హత్యలు చేశారు ఇద్దరు యువకులు. సంగారెడ్డి శివారు తో పాటు పటాన్చెరు మండలంలో ఇటీవల జరిగిన  హత్యలు కలకలం సృష్టించాయి. ఇక  విచారణలో బయటపడ్డ నిజాలు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. వివిధ ఆధారాలతో ఈ హత్యను ఛేదించారు పోలీసులు. 

 

 

 వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి మండలం లోని కల్పగూరు  కు చెందిన పాలడుగు కృష్ణ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో బస్సులో సంగారెడ్డిలోని మెహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద దిగాడు. అక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఒంటరిగా వెళ్తున్న ఆ వ్యక్తిని గమనించిన కృష్ణ శ్రీకాంత్ వెంబడించి కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపంలో అతనిపై దాడి చేసి చంపేశారు. అతని వద్ద ఉన్న పర్సు లాక్కుని  పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఆ తర్వాత రుద్రారం  సమీపంలో దాబాల్లో మద్యం తాగిన నిందితులు ఎదురుగా... ఉన్న గుడిసెలో  నిద్రిస్తున్న ఇద్దరు యువకుల పై కత్తితో దాడి చేసి చంపేశారు.

 

 

 కాగా సమీప ప్రాంతాల వారు వరుస హత్యలతో బెంబేలెత్తిన పోయారు. ఇక ఈ మూడు హత్యల సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు బ్యాగరి శ్రీకాంత్ అలియాస్ చందు... కృష్ణ అలియాస్ అజయ్ గా గుర్తించారు పోలీసులు. వీరిద్దరూ మద్యానికి బానిసై జల్సాల కోసం హత్యలకు పాల్పడుతున్నారని  తెలిపారు. వీరిద్దరూ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గోపాలపురం కి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఇక వీరిపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: