రోజు రోజుకు సమాజంలో జీవించే మనుషుల పాదం చెడువైపే అడుగులు వేస్తుంది.. ఇలా అనడానికి లోకంలో జరుగుతున్న ఎన్నో దారుణాలే కారణం.. ఇందులో కొన్ని మనుషులను గుడ్దిగా నమ్మి చేసే పనులు.. ఒక మనిషిని పూర్తిగా నమ్మితే అతనే జీవితంలో ఇక ముందు ఎవరిని నమ్మలేనంతగా దగా చేస్తే.. ఇప్పుడు ఇదో దందలా మారిపోయింది..

 

 

లోకంలో జరుగుతున్న దారుణాలను ఒక్క సారి చూస్తే.. రాజకీయ నాయకులు పాలనా పేరుతో పదవులు అనుభవిస్తూ, ప్రజాసేవ మంత్రాన్ని జపిస్తూ పేదవాళ్ళ ఆస్తులకు గండి కోడుతున్నారు. పెద్దవాళ్ళు చేస్తే ధర్మమని,పేదవాడు చేస్తే చట్టం ఊరుకోదని చెప్పకనే చెపుతున్నారు. మానవత విలువలను క్రూరంగా మార్చేస్తున్నారు. దేశాన్ని దోచుకోవటమే ధ్యేయంగా, జనాన్ని మోసగించటమే నాయకత్వంగా గొప్పలు చెప్పుకుంటున్నారు.

 

 

చరిత్ర చూసినా ఇంత ఘోరమైన మనుషులు లేరనిపిస్తుంది. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.. మరో వైపు దొంగబాబాలు,  కోట్లకు కోట్లు ఆస్తులు కూడ పెడుతూ భక్తి చాటునా భగవంతున్ని అమ్మేస్తున్నారు.. ఇదిగో ఇలా మోసాలు చేసే, మరో బాబా ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు.. స్వయం ప్రకటిత భగవాన్‌గా చెప్పుకునే దొంగబాబా 10-19 ఏళ్ల మధ్య వయస్సున్న ఐదుగురు అక్కాచెల్లలపై అత్యాచారం చేసి.. ఆపై లైంగికంగా వేధించినందుకు పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

అతని పేరు భగవాన్ సోమనాథ్ చావన్ (32).. ఇతను ఆ బాధిత యువతులను మభ్యపెట్టి, డబ్బులు లాగి ఆ పై అత్యాచారం చేయడమే కాకుండా లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై ఎవరికైనా చెబితే మీ అమ్మాయిలను చంపేస్తానంటూ వారి తల్లిదండ్రులను కూడా బెదిరించాడట. అంతే కాకుండా ఐదుగురిలో ఒకరిని దొంగ పెళ్లి కూడా చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ఇలాంటి తోడేళ్లూ లోకంలో తోలు కప్పుకుని తిరుగుతున్నారని తెలిసిన కూడా ఎలా మోసపోతున్నారో ప్రజలు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: