ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని శిక్షలు వచ్చినా కూడా ఆడపిల్లల మీద జరిగే అరాచకాలకి మాత్రం హద్దు అదుపు ఉండడం లేదు. ఎప్పటికప్పుడు ఆడవారి మీద ఏదో ఒకరకంగా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే... ఇటీవలె ఓ ఇంటర్మీడియట్ చదివే ఓ యువతి తన తల్లికి ప్రేమతో ఒక ఉత్తరాన్న రాసి మరి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఉత్తరం చేస్తే ఎటువంటి వారికైనా సరే కన్నీళ్ళు ఆగవు. మరి ఇంత దారుణమైన ఒక సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు. నాకు బతకాలని ఉంది.. కానీ బతకనివ్వట్లేదు వాడు.. తన గదికి రావాలంటున్నాడు. రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఐలవ్యూ అమ్మా. ఐ మిస్యూ అమ్మా…చనిపోయే ముందు ఓ యువతి రాసిన లేఖ ఇది. నాకు బతకాలని ఉంది… వాడు బతకనివ్వట్లేదు అని రాసింది చదివితే ఎవరికైనా కన్నీరు వస్తుంది.
ఓ యువకుడు తనను రూమ్కు రమ్మని వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు… ఆ ఉత్తరంలో పేర్కొంది. చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖ పోలీసులకు చిక్కింది. అయితే ఆ వేధింపులకు కారణమైన ఆ యువకుడు అసలు ఎవరు అనేది తెలియడం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఏతప్పు చేయని ఆ యువతి ఎందుకు భయపడింది. పోలీసులకు కనీస సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేదు. అలాగే ఏవో ఫొటోలు బయటపెడతానన్నాడు అన్న విషయాన్నితను లేఖలో రాసింది. ఒకవేళ వారిద్దరి మధ్య ఎటువంటి తప్పు జరగకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మరి ఆ ఫొటోలేంటి అసలు ఆ కథేంటి అన్నది మాత్రం బయటకు రాలేదు. మరోపక్క మహిళా సంఘాలు నిందిడి జాడ తెలుసుకుని కఠినంగా శిక్షించాలంటూ పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.