గడచిన మూడు రోజులుగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఐఎస్ఐ హస్తం ఉన్న విషయం బయటపడింది. అల్లర్ల వెనుక ఎవరి హస్తముంది అనే విషయంలో ఇంటెలిజెన్స్ సంచలన విషయాలు బయటపెట్టింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్ లో అల్లర్లు సృష్టించి నరేంద్రమోడి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలన్న ఏకైక టార్గెట్ తోనే అల్లర్లు రేపినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.

 

ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు మొదలుపెట్టి దేశమంతా అలజడులు లేపాలని ఐఎస్ఐ స్లీపర్ సెల్స్, ఐఎస్ఐ అండర్ వరల్డ్, ఐఎస్ఐ సోషల్ మీడియా విభాగం, అనేక వెబ్ సైట్లకు భారీ ఎత్తున నిధులు సమకూర్చి ప్రచారం చేయించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులకు సాక్ష్యాలు దొరికాయి. నేపాల్ దుబాయ్ దేశాల మీదుగా భారత్ లోకి పాకిస్ధాన్ కోట్లాది రూపాయల నకిలీనోట్లను పంపినట్లు నిఘావర్గాలు పసిగట్టాయి.

 

ఇప్పటికే రూ. 2 వేల నోట్లను పాకిస్ధాన్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రింకి దేశంలోకి చేరవేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మనదేశంలో అల్లర్లు సృష్టించేందుకు భారీగా డబ్బులు వెదజల్లుతోంది పాకిస్ధాన్. దేశంలోని ముస్లింలో కొందరిని, ఐఎస్ఐ సానుభూతిపరులను, టెర్రరిస్టు కార్యకలాపాలపై ఆసక్తి ఉండేవారిని, ముస్లిం శరణార్ధులను, అక్రమ వలసదారులతో ఇక్కడ అల్లర్లు చేయిచటానికి పాకిస్ధాన్ యథాశక్తి ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు దొరికాయి.

 

సిఏఏ, ఎన్నార్సీ, ఎన్ఫిఆర్ చట్టాలకు విరుద్ధంగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల లో ఐఎస్ఐ పాత్రను నిఘా అధికారులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుతున్న ఫోన్లను, వెబ్ సైట్లను, ఈ మెయిళ్ళను కూడా నిఘా అధికారులు పరిశిలీస్తున్నారు.  మొత్తానికి ట్రంప్ పర్యటన సందర్భంగా మొదలైన గోలతో పాకిస్ధాన్ కే ఎక్కువ నష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే జరుగుతున్న అల్లర్లలో ఐఎస్ఐ పాత్రను భారత్ ట్రంప్ ముందిచినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: