అదేసమయంలో తమిళనాడు, ఒడిసా ల నుంచి కూడా సీఎంలకు ఆహ్వానం అందింది. కానీ, ఏపీ సీఎం జగన్ కుమాత్రం ఆహ్వానం అందలేదు. ఈ విషయంలో స్పందించిన మాజీ సీఎం చంద్రబాబు.. కీలకమైన విమర్శ చేశారు. జగన్ నేరస్తుడు కాబట్టి ఆయనను పిలవలేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఆయన డిగ్నిటీకి భంగం కలిగించేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి దేశంలో 8మంది సీఎంలకు మాత్రమే రాష్ట్ర పతి భవన్ ఆహ్వానం పంపింది.
అదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కానీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కి కానీ ఆహ్వానం పంపలేదు. ఆహ్వానాల విషయంలో రాష్ట్రపతి భవన్ ఏ విషయాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నదో ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టలేదు. మేధావులు కూడా ఈ విషయంలో చేతులు ఎత్తేశారు. ఏదో ఒక విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని వీరిని పక్కన పెట్టారు అంటే.. విశ్లేషణలు ఉండేవి.
కానీ, ఏ విషయమూ చెప్పకుండానే సీఎంలను చాలా మందిని పక్కన పెట్టడం వీరిలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు కూడా ఉండడంతో రాష్ట్రపతి భవన్ నిర్ణయం లోతుపాతులు ఎవరికీ అర్ధం కాలేదు. కానీ, చంద్రబాబు మాత్రం పుసుక్కున జగన్పై తీవ్ర విమర్శ చేశారు. ఆయన నేరస్తుడు కాబట్టి పిలవలేదు అన్నారు. ఇదే నిజమైతే.. మరి మిగిలి 20 రాష్ట్రాల సీఎంలను కూడా ఇదే గాటన కట్టేశారని అనుకోవాల్సి ఉంటుంది. సోనియా సహా, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా నేరస్తులుగానే భావించాల్సి ఉంటుంది.
ఇక, మిగిలిన సీఎంలను కూడా నేరస్తులుగానే పరిగణించి పిలవలేదని అనుకోవాలి. కానీ, రాష్ట్రపతి భవన్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ, చంద్రబాబు మాత్రం జగన్ను ఉద్దేశ పూర్వకంగా కించపరిచేలా వ్యాఖ్యానించడం ఏమాత్రం బాగోలేదని అంటున్నారు పరిశీలకులు. ఆయనకు వ్యక్తిగతంగాజగన్పై కోపం ఉంటే వేరేలా విమర్శించాలి కానీ, కీలకమైన సమావేశాలకు ఆహ్వానం అందనంత మాత్రాన జగన్పై ఇలా వ్యక్తగత విమర్శలు చేయడం వల్ల తన స్థాయిని తనే బాబు తగ్గించుకున్నట్టు అవుతుందని అంటున్నారు.