అక్రమ సంబంధాలు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అనడంలో సందేహం అవసరం లేదు. అక్రమ సంబంధాల వలన ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ సంబంధాలు ఎలా మనిషిని ఇబ్బందులు పెడుతుంటాయో చెప్పక్కర్లేదు. అక్రమ సంబంధాల వలన కలిగే అనర్ధాలు దారుణంగా ఉంటాయి. వీటి వలన కలిగే నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఇవి మరింతగా పెరిగిపోతున్నాయి.
అక్రమ సంబంధాలను ముఖ్య కారణం ఏమైనా ఉన్నదా అంటే అది డబ్బు, అవసరం అని చెప్పాలి. ఈ రెండు కూడా మనిషిని ప్రలోభపెడుతుంటాయి. ఈ రెండింటి వలన మనిషి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అక్రమ సంబంధాల మత్తులో కన్న బిడ్డలను దూరం చేసుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లాలోని బుద్దారం గ్రామానికి చెందిన విజయ అనే మహిళ తోకల వెంకట్ రెడ్డితో కొన్నాళ్లుగా స్నేహం చేస్తున్నది. విజయ భర్త వెంకట్ రెడ్డి దగ్గరి నుంచి 45 వేలు అప్పుగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే విజయకు వెంకట్ రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ సంబంధం అక్రమ సంబంధానికి దారి తీసింది. వెంకట్ రెడ్డి, విజయలు తరచుగా కలుస్తుండేవారు.
భర్త బయటకు వెళ్లిన సమయంలో విజయ, వెంకట్ రెడ్డి మద్యం సెవించి ఇంట్లో ఉండగా, కొడుకు చూశాడు. 9 సంవత్సరాల కొడుకు ఎక్కడ ఈ అక్రమ సంబంధాన్ని బయటపెడతాడో అని చెప్పి వెంకట్ రెడ్డి, తల్లి విజయ కలిసి చంపేశారు. కొడుకు మెడకు టవల్ బిగించి చంపడంతో మెడ ప్రాంతం కమిలిపోయింది. దీంతో అనుమానించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసుకొని విచారించగా వెంకట్ రెడ్డి, విజయలు కలిసి హత్య చేసినట్టుగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.