ఈ ప్రపంచమే ఎన్నో వింతలకు నిలయం. అందులో మనిషి జనం కూడా ఒక వింతనే అని చెప్పవచ్చూ.. ఏందుకంటే కేవలం వీర్యకణాల ముద్ద, రక్తపు ముద్దగా మారి మనిషిగా రూపాంతరం చెందడం సృష్టిలో జరిగే ఒక అద్భుతం.. ఇకపోతే మనిషి శరీరాన్ని కేవలం ఒక దేహంగా తీసిపారేయడానికి వీలు లేదు.. పూర్వకాలంలో ఈ దేహంతోనే ఎన్నో అద్భుతాలు చేసారు.. ఇలా ఎన్నో విచిత్రాలు మనిషి జన్మలో తరచుగా చోటు చేసుకుంటాయి..

 

 

ఇకపోతే ఇక్కడ ఒక మహిళ దేహంలో కూడా జరిగే విచిత్రం ఏంటంటే.. ఆమే మూత్రం విసర్జిస్తే మద్యం వాసన వస్తుందట.. ఇలా తరచుగా రావడంతో ఇప్పుడు ఆ మహిళ షాకవుతుంది.. భయంతో వెంటనే హస్పిటల్‌కు పరుగులు పెట్టింది.. అయితే ఆ   వైద్యులు ఆమెను పరీక్షించి అతిగా మద్యం సేవించడం వలన లివర్ డ్యామేజ్ జరిగిందని, చెప్పారట.. కానీ, తనకు మద్యం సేవించే అలవాటు లేదని చెప్పినా వారు నమ్మలేదు.  అంతే కాదు అనవసరమైన సలహాలు కూడా ఇచ్చారట..

 

 

ఇక ఇంటికి వెళ్లిన ఆమెకు మళ్లీ ఇదే పరిస్దితి ఎదురవడంతో ఈ సారి గట్టిగానే వైద్యులను ప్రశ్నించగా ఆ మహిళను పూర్తిగా పరిశీలించిన వైద్యులు ఆమె పేగుల్లో కాండిడా గ్లాబ్రాట అనే ఈస్ట్ అధికంగా ఉన్నట్టుగా గుర్తించారు.  సర్వసాధారణంగా ఈ ఈస్ట్ ను మద్యం తయారీలో వినియోగిస్తున్నారట..  

 

 

అయితే ఈ మహిళ పేగుల్లో కూడా ఇలాంటి ఈస్ట్ లు ఉండటంతో ఆమె మూత్రం మద్యం వాసన వస్తొందని ఇది అరుదైన జబ్బుగా వైద్యులు పేర్కొంటున్నారు.  దీన్ని ఇలానే వదిలేస్తే ఫలితంగా చాలా ఇబ్బందులు వస్తాయని, వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలని సూచించారట.. ఏంటో ఈ కాలం మనిషిలోపల మద్యం తయారవడం నిజంగా ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: