సైబర్ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచు కుంటున్నారు. వివిధ వర్గాలకు బిస్కట్లు వేస్తూ బుట్టలో వేసుకుంటున్నారు. సేవాకార్యక్రమాలు నిర్వహణలో భాగంగా ఆసుపత్రులు, చర్చిలు నిర్మిస్తామంటూ, పలువురి మోసం చేస్తూ ఆన్‌ లైన్‌ ద్వారా డబ్బులు కాజేసే ఓ నైజేరియా ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

 

పీటర్‌ డానియల్‌ అనే నైజేరియాకు చెందిన వ్యక్తి ఫుట్ బాల్‌ కోచ్‌గా భారత దేశానికి వచ్చానని, దేశంలో చర్చిలు , ఆసుపత్రులను నిర్మిస్తూ సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నామని చెబుతూ కొందరిని మోసం చేస్తున్నాడు. విదేశీ విరాళాల్లో భాగస్వామ్యం అయ్యేవారు తమను సంప్రదించవచ్చునంటూ ఫేస్‌బుక్‌లో ప్రచారం చేసుకుంటున్నాడు. జాషువా మినిస్ట్రీస్‌ పేరుతో నకిలీ అకౌంట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు.

 

ప్రకాశం జిల్లా పొదిలి బాపిస్టు కాలనికి చెందిన అచ్చయ్య అనే వ్యక్తి ఆయన బుట్టలో పడ్డాడు. 2.4 మిలియన్ల డాలర్ల డబ్బుతో బయలుదేరి భారత దేశానికి వస్తున్నానని డేనియల్ అచ్చెయ్యకు చెప్పారు. ఇందులో భాగస్వామ్యం అయితే 20శాతం కమీషన్‌ ఇస్తామని వాట్సాప్‌ సందేశాన్ని పంపిచారు. దీన్ని నమ్మిన అచ్చయ్య అంగీకారం తెలిపి కొంత డబ్బు పంపించాడు.

 

ఆ తరువాత ఎయిర్‌ పోర్టులో ఉన్నాను.. కస్టమ్స్‌ అధికారులు సోదా చేసారని మరికొంత డబ్బు పంపిస్తే ఈ డబ్బును విడుదల చేస్తారని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ఆదాయపు పన్నుల శాఖ కు చొంత చెల్లించాలని, రిజర్వు బ్యాంకులో సమస్య తలెత్తిందని ఇలా.. పలు రకాలుగా చెబుతూ అచ్చయ్యకు ఫోన్‌ చేసి మొత్తం మీద 15 లక్షలు రూపాయలు తమ ఎకౌంట్‌లో వేయించుకున్నాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేసి నైజీరియా వ్యక్తి చేసిన మోసం గుర్తించారు. అతడికి సహకరించిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: