ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేదిక‌గా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయాడు. పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశారట. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల్లో రూ.5 భోజనం కోసం ఎదురుచూసే వాళ్లుండటమేమిటి? కుప్పంలో పేదరికమే లేదని గంటాపథంగా చెప్పాల్సిన వాడివి. ఇంత దీనపు పలుకులు ఏమిటి?'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

అన్న క్యాంటీన్లు రద్దుపై మాట్లాడిన చంద్రబాబుకు గట్టి పంచ్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి.. నిన్ను 9 సార్లు గెలిపించిన కుప్పం ప్రజలు ఇంకా 5 రూపాయిల భోజనం కోసం ఎదురు చూడటం ఏంటి చంద్రబాబు ? నిన్ను అన్ని సార్లు గెలిపిస్తే.. అక్కడ పేదిరికం లేకుండా చేశా అని గట్టిగా చెప్పాలిన నువ్వు.. ఇప్పుడు 5 రూపాయిల భోజనం గురించి మాట్లాడుతున్నావ్ ఏంటి? అంటే ఇక్కడే అర్థం అయిపోయింది.. నీ పాలన కనీసం నీ నియోజవర్గానికి కూడా ఉపయోగపడలేదు అని సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి..  

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. అటు విజయసాయి రెడ్డిపై.. ఇటు చంద్రబాబుపై మండిపడుతున్నారు. మరి కొంతమంది టీడీపీ అభిమానులు.. వైసీపీ అభిమానులు అయితే ట్విట్టర్ వేదికగా ఈ ట్విట్ కారణంగా చిన్నపాటి యుద్ధమే చేసుకుంటున్నారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: