వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా మరోసారి తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు.. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలు చేసే విమర్శలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి.. నేడు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. అసలు విజయసాయి రెడ్డి ఏం అన్నారు అంటే?..  

 

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబాబుకు ఒక మానసిక వ్యాధి ఉంది అని.. ఆ వ్యాధి పేరు నార్సిస్ట్స్కిక్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ అని.. ఆ వ్యాధి లక్షణాలు.. అతను లేకపోతే ప్రపంచమే లేదనే బ్రాంతిలో ఉంటారు అని.. అతను తప్ప అందరూ పనికిమాలిన వారనే ఉంటారు అని.. అలాంటి ఘోరమైన వ్యాధి ఇప్పుడు చంద్రబాబుకు వచ్చింది అని విజయసాయి రెడ్డి అన్నారు.. అంతేకాదు.. ఆ హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం కూడా ఆ వ్యాధి లక్షణాలే అని అయన ట్విట్ చేశారు.. 

 

విజయసాయి రెడ్డి ఇలా ట్విట్ చేశారు.. '' చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి.'' అంటూ విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. అతనికి వయసు అయిపోయింది కదండీ! అందుకే అలా మానసిక వ్యాధి వచ్చింది లెండి.. పాపం వదిలెయ్యండి వృద్ధుడిని అంటూ ట్విట్ చేస్తున్నారు.. మరికొందరు విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: