ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అందరు చాలా ఆక్టివ్ గా ఉంటున్నారు. వారికీ నచ్చిన నాయకుల గురించి పొగడ్తలతో ముంచెత్తుతారు. నచ్చిన వారికి అనుకూలంగా రకరకాల పోస్టులు పెడుతుంన్నారు. కొందురు అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న కొంత మంది పట్టించుకోవడం మానేశారు. వారికీ నచ్చిన వారిని కామెంట్స్ తో ఆకాశానికి ఎత్తుతారు. సామాజిక మాధ్యమాలల్లో కొందరూ తమకు నచ్చని రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా దూషించడం మొదలు పెడతారు. ఏ స్థాయిలో ఉన్నారో పట్టించుకోకుండా పిచ్చి రాతలు రాస్తూన్నారు. వారి రాతలో శృతి మించితే మాత్రం పోలీసులు వారి తాట తీస్తున్నారు.


ఓ నెటిజన్ సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన వైసీపీ నాయకుడు సీఎం పరిపాలన నచ్చకపోతే రాజ్యాంగ బద్ధంగా విమర్శలు చెయ్యాలి గానీ, అసభ్యకర వ్యాఖ్యలు ఏంటని పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు. 

 

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన పుల్లయ్య సీఎం జగన్ పై అసభ్యకరంగా మాట్లాడుతూ.. టిక్ టాక్ వీడియో చేశాడు. దీనిపై దువ్వూరు మండలం పెద్దజొన్నవరానికి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పుల్లయ్యపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా మంత్రులు, ఎమ్మేల్యేలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సంబంధిత శాఖలు కేసులు పెట్టేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ అయింది. అలాగే సోషల్ మీడియాలో మహిళలు, చిన్నారులపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు సంబంధించిన బిల్లులను సైతం అసెంబ్లీలో ఆమోదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: