దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు మానవ మృగాలు వారిపై అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్నారు. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. తల్లీ, చెల్లీ అనే తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన, కఠినమైన శిక్షలు విధించినా మహిళలపై జరుగుతున్న అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఓ వైవాహితపై నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..తిరుపత్తూర్ జిల్లా జవ్యాది కొండ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఉపాధి నిమిత్తం కొంతకాలంగా బెంగళూరులో ఉంటుండగా.. అతడి భార్య ఒంటరిగా జీవిస్తోంది. దీంతో ఆమెపై అదే గ్రామానికి చెందిన అలగేశన్ అనే యువకుడు కన్నేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో పొలానికి వెళ్లిన మహిళను అలగేశన్ అడ్డగించాడు. తన కోరిక తీర్చమని వేధించారు. దానికి నిరాకరించిన ఆమె అక్కడ నుంచీ పారిపోవడానికి ప్రయత్నించడంతో.. అఅలగేశన్తో పాటు వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను పట్టుకుని బంధించారు.
దీంతో అలగేశన్ ఆ మహిళను దారుణంగా కొట్టి సమీపంలోని పొదల్లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మిగిలిన ముగ్గురు వ్యక్తులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను అక్కడ వదిలేసి నలుగురూ పారిపోయారు. ఇక బుధవారం ఉదయం పొదల్లో నగ్నంగా పడివున్న మహిళను చూసిన స్థానికులు వెంటనే తిరుపత్తూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇక ఆ షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు తనను నలుగురు యువకులు రేప్ చేసినట్లు చెప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే బాధితురాలను రేప్ చేసిన ఆ నలుగురు కామాంధుల కోసం విసృతంగా గాలిస్తున్నారు.