వైసీపీ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మినబంటు ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు విజయ సాయి రెడ్డి. వైసీపీ పార్టీలో కీలక నేతగా... వైసీపీ పార్లమెంటరీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలపై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల నేతలు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వెంటనే స్పందిస్తూ వారికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి. తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ ప్రతిపక్షాల నోళ్ళు ముగిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎన్నో సార్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతలపై ఎన్నోసార్లు విమర్శనాస్త్రాలు సంధించారు. 

 


 ఇక తాజాగా మరోసారి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయ సాయి రెడ్డి. తాజాగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం విశాఖ కు వచ్చారు. అయితే చంద్రబాబుకు మొదటిలోనే చుక్కెదురైంది. భారీ మొత్తంలో వైసీపీ నేతలు విశాఖ విమానాశ్రయం వద్దకు చేరుకొని గో బ్యాక్  చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఇక అదే సమయంలో టీడీపీ నేతలు కూడా భారీ మొత్తంలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

 


 అనంతరం మాట్లాడిన చంద్రబాబు వైసీపీ కార్యకర్తలు ఎన్ని అవాంతరాలు సృష్టించిన ప్రజా చైతన్య యాత్ర చేసి తీరుత అంటూ  చంద్రబాబు తెలిపారు. అందరి భరతం పడతా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక తాజాగా దీని ఉద్దేశిస్తూ వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. కొండ పైనుంచి జారిపడుతున్న మధ్యలో కొమ్మను పట్టుకొని వేలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబుది... ఏ క్షణంలోనైనా ఆ కొమ్మ విరిగి పోవచ్చు లేదా చంద్రబాబు పట్టుతప్పి అగాధంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయ స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని భరతం పడతా... ఎవరిని వదిలిపెట్టేది  లేదు అని బెదిరిస్తున్నారు అంటే చంద్రబాబుది మాములు గుండె  కాదు అని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: