నేటికాలంలో చాల మంది ఉద్యోగులు పనిమనుషులపై ఆధారపడి జీవిస్తున్నారు.. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గరి నుండి ఆఫీసు పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసే అంతటి ఓపిక, తీరిక వారికి ఉండటం లేదు.. ఇలాంటి బిజి లైఫ్‌లో దాదాపుగా పనిమనిషి అవసరం ఎంతో ఉంటుంది.. ఇక అందరు ఇలా ఉండరు కాని అప్పుడప్పుడు కొందరు పని వారిని ఎంత మంచిగా చూసుకున్న మానవ బుద్ధిని ప్రదర్శిస్తారు..

 

 

కొందరైతే పనివారికి మరింత స్వేచ్చను ఇచ్చి, వారి ఇంటిలో ఒక మనిషిలా సొంత వారిలా ఆదరిస్తారు.. కాని మనిషిలో ఉన్న కుటిల బుద్ధి తిన్నగా ఉండనీయదు కదా.. అందుకే అక్కడక్కడ పనివారితో ప్రాణాలకు ప్రమాదాలు సంభవించిన సమయాలు కూడా ఉన్నాయి.. ఇక ఇంటిలో దొంగతనాలు, పిల్లలను కిడ్నాప్ చేయించడం వంటివి తరచుగా మనం వింటున్నాం.. అందుకే పనివారిని ఎంతగా నమ్మినా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. అన్ని అప్పచెప్పి టీవిలో గాని, బెడ్ రూంలో గాని మునిగిపోకుడదు..

 

 

ఇక కిచెన్‌లో పనిచేసే వారి విషయంలో కూడా ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా కొందరు పనివారు చేసే అరాచకాలు తెలియవు.. ఇదిగో ఇక్కడ ఉన్న వీడియో చూస్తే ఈ పనిమనిషి చేసిన పనికి కడుపులో దేవుతుంది.. ఛీ ఛీ అని వాంతులు చేసుకుంటారు.. అసలేం జరిగిందంటే.. గజియాబాద్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ మూత్రంతో వంట పాత్రలను శుభ్రం చేస్తూ సీసీటీవీ కెమేరాకు చిక్కింది. జగ్గుతో వంటగదిలోకి వెళ్లిన ఆమె అందులో మూత్రం పోసింది. ఆ తర్వాత మూత్రంతో పాత్రలను శుభ్రం చేసింది. సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఈ వీడియో చూసేవరకు ఇంటి యజమానికి అసలు విషయం తెలియదు.

 

 

ఇక ఈ మహిళ తమ వద్ద రెండేళ్ల నుంచి పనిచేస్తోందని, ఇలా ఎన్నిసార్లు చేసిందో తెలియదు గాని, ఒక రోజు అనుకోకుండా కిచెన్‌లో ఉండే కెమేరా పరిశీలించగా, ఇదిగో ఒలాంటి నీచపు పని చేస్తూ దొరికిందని తెలియ చేస్తూ, ఈ చర్యకు పాల్పడిన సదరు పనిమనిషి పై తగిన చర్యలు తీసుకోవాలని యజమాని పోలీసులను ఆశ్రయించాడట.. ఇక లోకంలో ఇలా అందరు చేస్తారని కాదు.. కానీ కొందరు మూర్ఖులు అక్కడక్కడ ఉంటారని తెలియ చేయడానికి మాత్రమే..

మరింత సమాచారం తెలుసుకోండి: