టామ్ అండ్ జెర్రీ స్టోరీ అందరికి తెలిసిందే.. ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే.. ఏపీలో రాజకీయాలు అచ్చం ఇలాగే సాగుతున్నాయి.. ఇదిగో మేక తోక అంటే అది మేక తోక కాదు.. పులితోక అంటు ఒకరికొకరు వాదులాడుకుంటున్నారు.. అక్కడి రాజకీయాల్లో ఏ చిన్న విషయం అయినా.. ప్రతిపక్షం వారు.. అధికార పక్షం వారు వాదులాడుకోవడం.. మీడియాలో రచ్చ రచ్చ చేయడం పరిపాటిగా మారింది...

 

 

ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి.. అదేమంటే చెడపకురా చెడేవు అనే సామేత.. అందరికి తెలిసిందే.. ఒకప్పుడు అధికారంలో ఉన్న బాబు జగన్‌ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాడు.. అడుగడుగున అవమానాలే.. ఏదో రాజకీయ కక్షలుంటే.. అసెంబ్లీలో చూసుకోవాలి.. లేదా ప్రజలకు చేసే అభివృద్దిలో చూపాలి.. మంచిపనులకు పోటీ పడే తత్త్వంతో ముందుకు సాగాలి గాని.. ఇలా వ్యక్తిగత కక్షలకు మాత్రం పోకూడదని  అనుకుంటున్నారట.. ఇకపోతే ఇప్పుడు చంద్రన్న జీవితం. భ్రాంతియేనా.. జీవితానా.. వెలుగింతేనా ఆశా.. నిరాశేనా.. మిగిలేది చింతేనా.. అనే చందాన మిగిలిపోయిందట.. తాను అనుకున్నది ఒకటి ఏపీలో జరిగేది ఒక్కటి..

 

 

ఇదే కాకుండా చంద్రబాబుకు పంటికింద రాయిలా విజ‌య‌సాయిరెడ్డి మారాడని, ఎప్పుడు అనుకోని రోజు ఉండదట.. ఇందుకు తగ్గట్టుగానే విజ‌య‌సాయిరెడ్డి బాబోరిని ఎప్పుడు చెడుగుడు ఆడుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు.... ఇదిగో ఇప్పుడు కూడా బాబోరిపై తన మాటల చతురతతో విరుచుకు పడ్డాడు..

 

 

చంద్రబాబు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి లక్షణాలు.. ఎలా ఉంటాయంటే తాను ఉన్నంత కాలం ఏపీలో అరాచకాలు, అవినీతి జరుగలేదని, తన పదవి పోయాక ఇప్పుడు ఏపీకి అంతా చీకటి మిగిలిందనే భ్రమలో రోజులు గడుపుతున్నాడని ఎద్దేవా చేశాడు.. ఇక వీరిద్దరి మాటల యుద్దం ఇప్పటితో ఆగేలా లేదు.. మహాసంగ్రామన్ని తలపించేలా సాగుతున్న వీరి మాటలకు ముగింపు ఎప్పుడో అని అనుకుంటున్నారట.. ఏపీ ప్రజలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: