భర్త మృగంగా మారి సొంత భార్య ని సొంత కొడుకు ముందే వివస్త్రను చేసి ఆమె ఒంటినిండా వాతలు పెడుతూ హింసిస్తుంటే ఆ భర్తని చంపేయాలన్నంత కోపం ఎవరికైనా వస్తుంది. పాపం, మాటల్లో వర్ణించలేనంతా శారీరక నొప్పిని, మానసిక క్షోభను అనుభవించిన ఆ భార్య తన భర్త శ్రీనివాస్ టార్చర్ ని చాలా రోజుల వరకు మౌనంగా భరించండి. కానీ గత రెండు రోజులుగా అతడి శాడిజం మీతిమీరింది. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. 

 


వివరాలు తెలుసుకుంటే... నార్సింగ్ పీఎస్ పరిధిలోని కోకాపేట నెమలి నగర్ లో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి తన భార్య, కుమారునితో కలిసి నివసిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్య పై అనుమానం పెంచుకున్న భర్త శ్రీనివాస ఆమెను వేధించడం ప్రారంభించాడు. తాజాగా అతడిలోని మృగం బయటికి వచ్చి భార్యపై హేయమైన చర్య చేశాడు. తన సొంత కొడుకు ముందు తన భార్య బట్టలు విప్పి మరీ ఎర్రగా కాల్చిన ఓ ఇనుప రాడ్ తో వాతలు పెట్టడం ప్రారంభించాడు. ఈ దారుణమైన ఘటన చూసి వద్దు నాన్నా అని అభం శుభం తెలియని కొడుకు ఏడుస్తున్నా... కనికరం కూడా లేకుండా... భార్య తలపై ఇనుప రాడ్డు ని గట్టిగా మోదాడు. దీంతో ఆమె తల పగిలి రక్తం వరదలా కారడం స్టార్ట్ అయ్యింది. అయినా కూడా భర్త లో కొంచెం కూడా జాలి, దయ, కనికరం కలగలేదు. ఆమె కూడా కొట్టకండి అంటూ గగ్గోలు పెడుతున్న అతడు మాత్రం కుమారుడితో వీడియో చిత్రీకరిస్తూ రాక్షసానందం పొందాడు. 

 


దీంతో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ రాక్షసుడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా... అతడు భార్య పై చేసిన అఘాయిత్యాలు ఒక్కోటిగా వెలుగులోకి వచ్చాయి. అతని సెల్ ఫోన్ లో వీడియోలు కూడా చూసిన పోలీసులు ఓ మనిషి ఇలా కూడా చేస్తాడా? అనుకుంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐతే ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న నర్సింగ్ సీఐ గంగాధర్ తమదైన శైలిలో విచారణ చేపట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: