చంద్రబాబు ఎవరికైన భయపడుతాడు అంటే అది ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి అనే చెప్పాలి.. ప్రత్యేక్షంగా అయినా పరోక్షంగా అయినా చంద్రబాబును విజయసాయి మాటలతోనే ముప్పుతిప్పలు పెట్టేస్తారు.. విజయసాయి సెటైర్లకు చంద్రబాబు ముఖం తిప్పేసుకుంటారు.. ఒక్క చంద్రబాబుపైనే కాదు.. అతని సుపుత్రుడు లోకేష్ పై కూడా ఆ రేంజ్ లోనే సెటైర్లు వేస్తారు. 

 

అయితే ఆ సెటైర్లకు.. విజయసాయి రెడ్డి చేసే విమర్శలకు చంద్రబాబు, లోకేష్ రిప్లై ఇవ్వలేక.. బుద్ధా వెంకన్నతో ఇప్పిస్తారు.. వీళ్ళు ఇద్దరు విమర్శలు చేసుకోవడం మనకు తెలిసిందే.. ఇకపోతే ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వ్యాఖ్యలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.. 

 

అంత సంచలన వ్యాఖ్యలు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. చంద్రబాబుకె దిక్కు లేదు కానీ అయన ఇంకొకరిని బెదిరిస్తున్నాడు.. కొండపై నుండి జారిపడుతూ మధ్యలో ఓ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నాడు.. ఏ క్షణంలో అయినా పట్టు తప్పి కింద పడచ్చు.. లెస్స కొమ్మ విరగొచ్చు.. అలాంటి నిస్సహాయతలో కూడా చంద్రబాబు బెదిరిస్తున్నాడు అంటే.. బాబొరి గుండె మాములు గుండె కాదు అంటూ సెటైర్లు వేశారు విజయసాయి రెడ్డి.. 

 

అసలు విజయసాయి రెడ్డి ఎం అని ట్విట్ చేశారు అంటే?.. ''కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు!'' అంటూ సెటైర్లు వేశారు.. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: