ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఏదో పని చేసుకుని నెల జీతంతో బతికే బదులు దొంగతనాలు చేస్తే   ఒక్కసారిగా వచ్చిన డబ్బులతో జల్సాలు  చేయాలని అనుకుంటున్న  జనాలు ఎంతో మంది దొంగలు గా మారుతున్నారు. ఇంకొంతమంది జల్సాల జీవితానికి అలవాటు పడి దొంగలుగా మారుతున్నారు. ఇక దొంగతనాలు చేయడంలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తూ... పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎంతో తెలివిగా దొంగతనాలు ప్లాన్ చేస్తూ ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక సరికొత్తగా ఆలోచిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. 

 

 

 కానీ ఇక్కడ దొంగ మాత్రం ఏం చేసాడో తెలుసా... ఓ  ఇంట్లో దొంగతనం చేయాలి అనుకునే ఎంతో తెలివిగా ఇంట్లోకి ప్రవేశించాడు... అనంతరం వెళ్లిన పని మరిచిపోయాడో  ఏమో... హాయిగా సోఫాలో నిద్ర పోయాడు ఆ దొంగ. అది కూడా ఒక గంటో రెండు గంటలో కాదండోయ్... ఏకంగా తెల్లారే వరకూ సోఫాలో నిద్ర పోయాడు. ఇక తెల్లారాక యజమాని వచ్చి మరి ఆ దొంగను నిద్ర లేపాల్సిన  పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. 

 

 

 ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగ సోఫాలో పడుకుని పొద్దున్నే యజమానికి దొరికిపోయిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది.  ఈ తాగుబోతు దొంగ చేసిన పని కాస్త ప్రస్తుతం నెట్టింట్లో  వైరల్ గా మారిపోయింది. ఓ ఇంట్లో  దొంగతనం చేయాలని భావించిన దొంగ... ఇంటి పైన ఉన్న ఒక టైల్స్  తొలగించి  ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక అప్పటికే మద్యం మత్తులో ఉన్న దొంగ వచ్చిన పని మర్చిపోయే సోఫాలో హాయిగా నిద్ర పోయారు.  ఏకంగా తెల్లారే వరకు అలాగే నిద్ర పోవడంతో పొద్దున లేచిన యజమాని అతన్ని చూసి ఏకంగా కర్రతో ఒకటి బాది  నిద్రలేపాడు అనంతరం పోలీసులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: