ఆ హిజ్రా అతన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది. అతను ప్రేమించాడు.. కానీ హిజ్రాను కాదు.. హిజ్రా డబ్బును. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.. చివరికి డబ్బు తీసుకొని పరారయ్యాడు.. పెళ్లి చేసుకుంటా అని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయ్యాడు.. మోసపోయా అని తెలుసుకున్న హిజ్రా చేసేది ఏమి లేక పోలీసులు ఆశ్రయించింది.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిదిలో నివాసం ఉంటున్న లక్కీరాయ్ అలియాస్ శ్రీను అనే ట్రాన్స్‌జెండర్ మొహమ్మద్ రియాజ్ అనే వ్యక్తితో 3ఏళ్లగా ప్రేమలో ఉంది. 2018లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు.. ఏడాదిన్న పాటు ఇద్దరు చెట్టపట్టాలు ఏసుకొని తిరిగారు.. చివరికి హీజ్ర వద్ద డబ్బు తీసుకొని పరారయ్యాడు. 

 

అంతేకాదు మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.. దీంతో హిజ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అతన్ని ఎలా అయినా సరే పట్టుకోవాలని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చెయ్యాలని పంజాగుట్ట పోలీసులని వేడుకుంది. మరి ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందించారు అనేది తెలియాల్సి ఉంది. 

 

అమ్మాయిలను మోసం చేసే వారి సంఖ్యా మన దేశం లో ఎక్కువే, కానీ హిజ్రాలను కూడా వదలట్లేదు కొందరు అబ్బాయిలు. ప్రేమ, పెళ్లి అంటూ మాటలు చెప్పి హిజ్రా లను నమ్మించి వారిని మోసం చేస్తున్నారు కొందరు. హిజ్రాల పైన ఈ మధ్య ఎక్కువ దాడులు చేస్తున్నారు.. పెళ్లి చేసుకుంటా అని మోసాలు చేస్తున్నారు. 

 

ఇలాంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఎంతోమంది హిజ్రాలను ఇలాగె మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: