అమ్మదనంలోని గొప్పతనం ఆ బ్రహ్మకు కూడ తెలియదు కావచ్చూ.. అందుకే అందరి తలరాతలు గజిబిజిగా రాస్తాడేమో.. ఇక సృష్టిలో అతి మధురమైన పదం ఏదంటే అమ్మ అనే పిలుపని అందరికి తెలిసిందే.. ఇలాంటి కమ్మనైన అమ్మ పిలుపు కోసం తపించని ఆడపిల్ల ఉండదు.. కానీ నేటి సమాజంలో అమ్మ అంటే అంగడి బొమ్మాలా మారుతుంది.. కన్నపేగును కూడా కామం కోసం కాలరాస్తున్న తల్లులున్న నేటికాలంలో మానవతా విలువలు పూర్తిగా సమాధి అవుతున్నాయి.. ఇందుకు ఉదహరణగా కొందరు తల్లులు చేస్తున్న నీచమైన పనులే..

 

 

ఇకపోతే ఒక తల్లి తన కోరికను ప్రియుడితో తీర్చుకోవడానికి పిల్లలు అడ్దువస్తున్నారని నిర్ధాక్షిణ్యంగా చంపేసింది.. మనసున్న ప్రతి వారిని చలింపచేసే ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే.. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పెద్దకమ్మవారి పల్లి గ్రామంలో ఆదివారం ముగ్గురు పిల్లల హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియుడితో జీవితాన్ని సాగించేందుకు కన్నతల్లే చిన్నారులను బావిలో తోసి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తల్లితో పాటు ఈ ఘటనకు కారణమైన వారందరిని అరెస్ట్ చేసినట్లు పుట్టపర్తి డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు.

 

 

ఇక  భర్త స్నేహితునితోనే అక్రమ సంబంధాన్ని నెరుపుతున్న ఈ మహిళ విషయం తెలిసిన అతని భార్య ఈ మహిళతో చాల గొడవపెట్టుకుందట.. ఈ నేపధ్యంలో తన భర్త జోలికి వస్తే సహించేది లేదని, తన కాపురాన్ని నాశనం చేయొద్దని హెచ్చరించిందట. అయినా తన పద్దతి మార్చుకోని అరుణమ్మ అనే మహిళ  ప్రియుడితోనే కలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన ముగ్గురు పిల్లను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి వ్యవసాయ బావిలో తోసేసింది...

 

 

రాత్రి సమయంలో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న అరుణమ్మను స్థానికులు చూసి నిలదీయగా తన పిల్లలను బావిలో తోసేశానని చెప్పి తాను కూడా దూకేసింది. స్థానికులు బావిలో దూకి ఆమెను రక్షించగా ముగ్గురు పిల్లలు అప్పటికే ప్రాణాలు వదిలారు. కాగా జరుగవలసిన నష్టం అంతా జరిగాక పశ్చాత్తాప పడిన అరుణమ్మ వీఆర్వో లలిత దగ్గర లొంగిపోయింది. ముగ్గురు పిల్లల హత్యలో పరోక్ష పాత్ర ఉన్న అరుణమ్మ భర్త రమేశ్‌ను కర్ణాటకలోని నాగేపల్లి బ్రిడ్జి వద్ద..  ఎనుములపల్లిలో  గురుమూర్తి, అతని భార్య రాధమ్మను  పోలీసులు అరెస్టు చేశారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: