ఈ మద్య మనుషులు కృర మృగాల కన్నా దారుణంగా మారుతున్నారు.  కృర మృగాలు అడవిలోకి వచ్చిన వారిపైనే దాడి చేస్తాయి.. కేవలం వాటి ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే.. అది సృష్టి దర్మం.  కానీ ఈ మద్య మనుషులు రాక్షసుల కన్నా ఘోరంగా మారుతున్నారు.  పురాణాల్లో నరకంలో రాక్షసులు ఎదుటి వారిని పైశాచికంగా చంపి తినడం.. హింసించే వారని విన్నాం.. కానీ ఇప్పుడు కొంత మంది మనుషులను ప్రత్యక్షంగా చూస్తున్నాం.  తాజాగా ఢిల్లీ అల్లర్లలో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన కానిస్టేబుల్ అంకిత్ శర్మ (26)ను దుండగులు దారుణంగా హతమార్చి డ్రైనేజీలో పడేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లల్ల లో భాగంగా మృతుల సంఖ్య 40 కి చేరాయి. 

 

ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయట.. ఎంత దారుణం అంటే కొన్ని మృతదేహాలు మురికి కాలువల్లో తెలుగుతన్నాయని సమాచారం.  అయితే ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన కానిస్టేబుల్ అంకిత్ శర్మ దుండగులు అత్యంత కిరాతకంగా చంపారు.  అసలు ఈ విషయం చెప్పాలంటే గుండెలు చిక్కపట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.  కొంత మంది దుండగులు అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హతమార్చి డ్రైనేజీలో పడేసిన సంగతి తెలిసిందే. అంకిత్ శర్మ పోస్టుమార్టం నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఒక దశలో తమ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు.

 

పదునైన ఆయుధంతో అనేకసార్లు దాడి చేయడం వల్లే అంకిత్ శర్మ చనిపోయాడని పోస్టు మార్టం రిపోర్ట్ తేల్చింది. దుండగులు అతడి శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా కత్తితో తూట్లు పొడిచారు. అంకిత్ శర్మ శరీరంపై 400కు పైగా కత్తి గాట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడించింది. దాదాపు ఆరుగురు వ్యక్తులు అతడిని తీవ్రంగా గాయపర్చి ఉంటారు అని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.  కత్తి పోట్ల ధాటికి పొట్టలోని పేగులు చిధ్రమైపోయాయి. కాగా తన కుమారుడి మరణానికి ఆప్ నేత తాహిర్ హుస్సేన్ కారణమని అంకిత్ శర్మ తండ్రి ఆరోపించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: