గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్‌ పై విచారణను వేగవంతం చేస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న తీర్పుపై రివ్యూ పిటిషన్లు విచారణ పూర్తయిన తర్వాత ఈ అంశంపై విచారణ చేపడతామని ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా., ఎన్నికల సమయంలో హిందుత్వ నినాదంతో ఓట్లను అడిగే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని అనుకూల, వ్యతిరేక వర్గాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. 

 

 అయ్యప్ప ఆలయం కేసును తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మార్చి 16 నుంచి రోజువారీ విచారణ చేపడుతుందని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ మోహన్ ఎం శాంతన గౌండర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తికి స్వైన్‌ఫ్లూ సోకడంతో విచారణ ఆలస్యమైందని జస్టిస్ బాబ్డే తెలిపారు.

 

 

ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. హిందూత్వ నిర్వచనంపై మరోసారి పునఃసమీక్షించాలని ప్రతివాదులు కోరుతున్నారని అన్నారు. ‘హిందుత్వ’తీర్పును సరిచేయాలని వారు కోరుతున్నారని, ఈ అంశంపై సుదీర్ఘ సమయం పడుతుందని భావిస్తున్నామన్నారు. శబరిమల కేసులో విచారణ పూర్తయిన తర్వాత ఈ పిటిషన్ వాదనలు వినడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో హిందూత్వ లేదా హిందూయిజం పేరుతో ఓట్లను అడగడం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123లోని సబ్-సెక్షన్ (3) లేదా (3ఏ) ప్రకారం అనర్హులుగా పేర్కొలేమని1995 డిసెంబరు 11 నాటి రమేశ్ యశ్వంత్ ప్రభూ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 

 

 

‘హిందూ’,‘హిందుత్వం’‘హిందూ మతం’ అనే పదాలకు కచ్చితమైన అర్ధాన్ని ఆపాదించలేమని.. భారతీయ సంస్కృతి, వారసత్వ విషయాలను మినహాయించి మతం పరిమితం చేయలేం... ‘హిందుత్వ’ అనే పదం భారత ఉప ఖండంలోని ప్రజల జీవన విధానంతో ఎక్కువ సంబంధం కలిగి ఉందని కూడా సూచించబడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: