తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్ నటుడు మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేసి తన సినిమాల్లో బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి మనసు మళ్ళీ రాజకీయాల వైపు మళ్ళిందో లేదో తెలియదు కానీ రాజకీయ పరంగా మాత్రం అతని పై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు జగన్ చిరుకు రాజ్య సభ స్థానం ఇవ్వబోతున్నారని వార్తలు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో సరికొత్త వార్త చిరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

 

చిరు పై జరుగుతున్న ప్రచారం ఏమిటంటే రాజధానిగా అమరావతే కొనసాగాలని దానికి చిరు మద్దతు ప్రకటించాలని అలా చేసేంత వరకు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న చిరు ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తామని జేఏసీ సభ్యులు తెలుపుతున్నారు.వచ్చే ఫిబ్రవరి 29 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేసి చిరును డిమాండ్ చెయ్యాలని పూనుకున్నారు.

 

ఇప్పటికే చిరు జగన్ మూడు రాజధానుల పాలసీ కి అనుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా.... అమరావతిలోనే ఆంధ్ర రాజధాని ఉండేందుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో అదే సోషల్ మీడియాలో రాజకీయాలలో లేని చిరంజీవి ని ప్రశ్నించే ఉద్దేశం ఉన్న మీకు ఎమ్మెల్యేగా ఉన్న హీరో బాలకృష్ణను విషయంపై ఎందుకు స్పందించమని డిమాండ్ చేయరని వైసీపీ మద్దతుదారులు అడిగారు

 

బాలకృష్ణ కూడా ప్రముఖ సినీ నటుడు కానీ విషయంలో మాత్రం రాయలసీమ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఇప్పుడు చిరంజీవికి బాలకృష్ణకి లింక్ పెట్టేసిన జగన్ చిరంజీవి అభిమానులగా చెప్పుకునే వైసీపీ కార్యకర్తల చేత సోషల్ మీడియాలో కౌంటర్ పోస్ట్ వేయించి వారికి సరైన సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: