ఉత్తరాది నుంచి దక్షిణాది వరకుఢిల్లీ నుంచి గల్లీ దాక ఆయన వ్యూహం ఫలితం వల్ల ఎన్నికల్లో ఆయన పని చేసిన పార్టీలు, వ్యక్తులు అనూహ్య ఫలితాలు సాధించారు. అధికారానికి దూరమైన వారికి మళ్లీ చెంత చేరుస్తుండడంతో ఇప్పుడు అతడిని పలు పార్టీలు ప్రసన్నం చేసుకుంటున్నాయి. అతనే దేశంలో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిన ప్రశాంత్ కిషోర్. చాలా స్ట్రాటీజిస్ట్ గా అతని సంస్థ చేస్తున్న పనులతో రాష్ట్రంలో వారు కలిసి పని చేసే పార్టీలకు అధికారం ఈజీగా వచ్చేస్తోంది. కాబట్టి ఇప్పుడు అతనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

 

ఆంధ్రపదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్రలో శివసేన, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయం సాధించడంతోపాటు గతంలో ప్రధానిగా నరేంద్రమోదీ ఎన్నికలో అద్భుత విజయం సాధించడంతో అందరి దృష్టి ప్రశాంత్ కిశోర్ పై పడింది. దీంతో దేశంలో బడా రాజకీయ పార్టీల కన్ను అతని పై పడింది. ఎన్నికల వ్యూహలు రచించి తమకు అధికారం వచ్చేలా చేయమని కోరుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తమిళనాడులో డీఎంకేతో ప్రశాంత్ కిశోర్ కలిసి పని చేస్తున్నాడు. మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

 

ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో జగన్ కోసం మళ్లీ పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ కి అసలు సమయం ఉంటుందా అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా మారిన ప్రశాంత్ కిషోర్ దాదాపుగా ఈసారి తన సేవలను జగన్ కు అందించకపోవచ్చు. ప్రశాంత్ కిషోర్ విలువను దేశానికి తెలియజేసిన జగన్ ఇప్పుడు అతని విజయవంతమైన కెరీర్ వల్ల పీకే లాంటి టాలెంటెడ్ వ్యక్తిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: