డాక్టర్ ని దైవంతో సమానంగా కొలుస్తారు. అలాంటి డాక్టరే అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వైద్యం కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై డాక్టర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారని మహిళ వాపోయింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పోలీసులను ఆశ్రయించి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఘటన పుణేలో మరోసారి వెలుగులోకి వచ్చింది. 

 

పూణె‌కి చెందిన ఓ మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని గతేడాది అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన కొడుకు కూడా మరోసారి రేప్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వైద్యం కోసం వెళ్లినందుకు తన జీవితం నాశనం చేశారని గగ్గోలు పెట్టింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

రేప్ కేసు నుంచి బయటపడేస్తానంటూ వచ్చిన వ్యక్తిని నమ్మి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. మొత్తం రూ.1.3 కోట్లు ఇస్తే తన కుమారుడిని కేసు నుంచి బయటపడేస్తానని.. లేకుంటే పదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడడంతో డబ్బులు ఇచ్చినట్లు చెప్పాడు.

 

ఆ వ్యక్తి ఇంకా రూ.55 లక్షలు కావాలని బెదిరిస్తున్నాడడంతో.. దిక్కుతోచక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేప్ కేసు పెట్టిన మహిళతో ఆస్పత్రి బిల్లు విషయంలో వివాదం జరిగిందని.. అందుకే ఆమె రేప్ కేస్ పెట్టినట్లు తేలింది. ఆమె దళిత మహిళ కావడంతో ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన డాక్టర్.. అతనికి డబ్బులు చెల్లించినట్లు చెప్పాడు.

 

డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేశారు. సెటిల్‌మెంట్‌ అంటూ డబ్బులు కాజేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: