మనషులకు కులం, మతం ఉంటాయి. కానీ ప్రేమకు కులం, మతం అంటూ ఉండదు. ప్రేమికులకు ఒక్కటే కులం ఉంటుంది, అదే ప్రేమకులం. అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్న ఆ జంటకు కులమే శాపమైంది. ఇద్దరి కులాలు వేరుకావడంతో..వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆందోళన. దీంతో కలిసి బతికే అవకాశం లేదని మనస్తాపం చెందిన ఆ జంట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసికుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఉరి వేసుకుని ప‌ది రోజుల‌కుపైగా కావ‌డంతో మృత‌దేహాలు దారుణ స్థితికి చేరుకున్నారు.  ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిత్తూరుు జిల్లా సోమల మండల కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక సోమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. 

 

ప్రక్క గ్రామమైన పేగలవారి పల్లె కు చెందిన ఆటో డ్రైవర్ ని ప్రేమించింది. కొంతకాలం ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయం వారిని వెంటాడింది. కలిసి జీవించే అవకాశం తమకు ఉండదని భావించిన ప్రేమికులిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఫిబ్రవరి 15న ఇంట్లోంచి వెళ్లిపోయిన వీరిద్దరి కోసం కుటుంబీకులు, బంధవులు, పోలీసులు చుట్టుపక్కలంతా గాలించారు. 

 

ప‌ది రోజులు గడిచిపోయిన ఆచూకీ లభించకపోవటంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చివరకు ఫిబ్రవరి 28వ తేదీన మేటిమంద అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలనపై ఆరా తీశారు. దీంతో అస‌లు విష‌యం బయటపడింది. ప‌ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన జంటగా గుర్తించారు. ఇక వారు చనిపోయి చాలా రోజులు కావటంతో మృత‌దేహాలు దారుణ స్థితికి చేరుకున్నాయి. దీంతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కాగా, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమజంట ఆత్మహత్యతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: