ఈ మధ్యకాలంలో లోకం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రేమ పేరుతో హత్యలు చేయడం ఆత్మహత్యలు చేసుకోవడం లాంటిది ఎక్కువగా జరుగుతున్నాయి నేటి సమాజంలో. ఇక అప్పుడప్పుడే ఎదుగుతున్న వయసులోనే ఆకర్షణను  ప్రేమగా భావించి.. ప్రాణాలను అర్పిస్తున్నారు చిన్నారులు. ఇంకా సరిగ్గా లోకానికి కూడా చూడని  చిన్నారులు ప్రేమ పేరుతో పై లోకాలకు వెళ్లిపోతున్నారు. అతి చిన్న వయసులోనే ప్రేమా దోమా అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈరోజుల్లో  చాలానే తెర మీదకు వస్తున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. 9 వ తరగతి లోనే ప్రేమ పేరుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక్కడ ఒక బాలుడు. 

 

 

 ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల పరిధిలోని గోగులమూడి లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చౌడూరు శైలజ భర్త నుంచి విడిపోయి కుమారుడు కుమార్తె తో ఉంటుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇక ఆమె కుమారుడు మహేష్ అక్కడే స్థానికంగా ఉన్న సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం రాత్రి వేళ పని ఉందని బయటకు వెళ్లిన ఆ బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. ఇక కావూరి చెరువు సమీపంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ ఘటనను ఉదయం స్థానికులు గుర్తించారు.

 

 

 ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఆ బాలుడు మృతదేహాన్ని పరిశీలించగా... అతని మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. తాను బాగా చదువుకొని అమ్మను బాగా చూసుకోవాలని అనుకున్నానని... కానీ ఇప్పుడు చనిపోతున్నాను అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు ఆ బాలుడు. తాను ఏం తప్పు చేయకున్న.. అందరు  తాను తప్పు చేసినట్లు గా మాట్లాడుతున్నారూ  అంటూ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన వల్ల ఓ  అమ్మాయికి చెడ్డపేరు వచ్చింది అంటూ తెలిపిన బాలుడు... తాను ఆమెను ప్రేమించానని విషయం తెలుసుకోకుండా తనపై అభాండాలు వేశారని.. టీచర్ కూడా మందలించి  తనను కొట్టింది అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తాను మరణించిన విషయాన్ని ఆమెకు చెప్పొద్దూ అంటూ తెలిపాడు సదరు బాలుడు. ఇది తన ఆఖరి కోరిక అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: