పద్దెనిమిది ఏళ్ల వయసు లోపు పిల్లలతో పని చేయించుకుంటే చట్టపరంగా నేరం అన్న సంగతి తెలిసిందే.. ఒక వేళా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకింగా పిల్లలతో వెట్టి చాకిరి చేయించుకుంటే శిక్షలు తో పాటుగా భారీ జరిమానాను కూడా చెల్లించుకోవాలి. కానీ అన్నీ తెలిసిన ఓ తెలుగు ప్రముఖ యాంకర్ తన ఇంట్లో ఇద్దరు బాలికలను ఇంట్లో పనిలో పెట్టుకొని పని చేయించుకుంటుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

 


ఇద్దరు మైనర్ బాలికలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న తెలుగు టీవీ యాంకర్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికలను సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. ఆ తర్వాత తిరిగి పంపకుండా ఓ టీవీ యాంకర్ ఇంట్లో వారిద్దరిని పనికి కుదిర్చింది. పండగ సెలవులు ముగిసినా బాలికలు తిరిగి రాకపోవడం, తల్లికి ఫోన్ చేస్తే స్పందించకపోవంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 


రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్నారు. పోలీసులు చైల్డ్ కేర్ కమిటీతో కలిసి హైదరాబాద్ వెళ్లి వారి తల్లిని విచారించగా ఓ యాంకర్ ఇంట్లో పనికి కుదిర్చినట్లు చెప్పింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఆ యాంకర్ ఇంట్లో వెట్టిచాకిరీ చేయించుకునేవారని, బాడీ మసాజ్ లాంటి పనులు కూడా తమతో చేయించుకున్నారని తెలిపారు.

 

 


అంతేకాకుండా ఆ యాంకర్ కు హెచ్చరించారు. అలాగే రంగ ప్రవేశం చేసిన చైల్డ్ వెల్ఫీకేర్ సభ్యులు ఆమెపై కేసు నమోదు చేశారు. మైనర్లను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరీత్యా నేరమని యాంకర్‌కు చెప్పిన పోలీసులు వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆమెను విచారించగా నేను ఎం వాళ్ళను పనిలో పెట్టుకోలేదు అంటూ వాళ్ళను ఎదురుగా పెట్టుకొని కల్లబొల్లి మాటలు చెప్పడం పై మండిపడ్డ అధికారులు నోటీసులు జారీ చేశారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: