రోజు రోజుకు ఈ గోలా పెరిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయన సుపుత్రుడు నారా లోకేష్ ఏదో ఒక నోరు పారేసుకుంటారు.. దానికి ప్రత్యేక్షంగానో పరోక్షంగానో వైసీపీ ప్రధాన కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వెయ్యడం కామన్ అయిపోయింది అంటే నమ్మండి. 

 

ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి పరోక్షంగా చంద్రబాబును, అతని కొడుకు నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్య‌ల‌ను చేశారు.. వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది అని ఆ ఫోబియా పేరు పులివెందుల ఫోబియా అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. 

 

సాధారణంగా వాళ్ళ పేర్లు చెప్పి సెటైర్లు వేసే విజయసాయి రెడ్డి.. ఈరోజు ఎందుకో మరి పరోక్షంగానే గుండెలు పగిలేలా సంచలన వ్యాక్యలను చేసారు.. అక్కడ విజయసాయి రెడ్డి వాళ్ళ పేర్లు చెప్పకపోయినప్పటికీ నెటిజన్లు.. వాళ్ళు ఎవరో మాకు తెలుసులెండి.. ఆ పప్పు.. పప్పు తండ్రే కదా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ట్విట్ సోషల్ మీడియాలో కొద్దీ క్షణాల్లోనే వైరల్ అవుతోంది. 

 

విజయసాయి రెడ్డి అసలు ఎం అని ట్విట్ చేశారు అంటే? ''వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!'' అంటూ ట్విట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: