ఇటీవ‌ల కాలంలో ఆడ‌వారిపై జ‌రుగుతున్న దారుణాల‌కు అంతూ లేకుండా పోతోంది. ఒకవైపు ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అంటూ మహి ళలను ఆశానికి ఎత్తేస్తున్నా మరోవైపు రోజురోజుకూ వారిపై జరిగే దాడులు పెరిగిపోతున్నాయి. భ్రూణహత్యలు మొదలు.. అత్యాచారాలు, గృహహింస వేధింపులు ఎక్కువవుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్తచట్టాలు తెస్తున్నా.. వీటిపై జనాలకు సరైన అవగాహన లేకపోవడంతో ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నా యి. సాధార‌ణ మ‌హిల‌లే కాదు.. ఒక్కోసారి అధికారంలో ఉన్న మ‌హిళ‌లు కూడా వీటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇక తాజాగా ముంబైకి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం కేసు నమోదైంది. 

 

బీజేపీ మాజీ ఎమ్మెల్యే  నరేంద్ర మెహతా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని..  థానే జిల్లా బయందర్ మహిళా కార్పొరేటర్  ఆరోపణలు చేశారు. అతి దారుణంగా 20ఏళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా తనను అత్యాచారం చేస్తున్నాడని, వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ‌రియు 2015లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తనను బెదిరించాడని మెహతా అనుచరుడు సంజయ్ థర్తారేపై కూడా మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నరేంద్ర మెహతాతో పాటు ఆయన సన్నిహితుడు సంజయ్ పైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

 

రేప్, అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నరేంద్ర మెహతా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా, నరేంద్ర మెహతా మూడు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన‌ట్టు తెలిపారు. కాగా, ఈయ‌న  2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి గీతాజైన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఆరోపణలు చేసిన బాధితురాలు కూడా బీజేపీకి చెందిన నేత కావడం గమనార్హం. సొంత పార్టీ నేతపైనే అత్యాచారం ఆరోపణలు చేయడం బీజేపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: